ప్రముఖ కథానాయకుడు జూ.ఎన్టీఆర్.. 'ఆర్ఆర్ఆర్' తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో ఇద్దరు హీరోయిన్లకు చోటుందని, ఓ పాత్ర కోసం ముద్దుగుమ్మ సమంతను ఎంచుకున్నారని సమాచారం.
ఈమెతోపాటు పూజా హెగ్డే, జాన్వీ కపూర్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మరి నిజమెంతో తెలియాలంటే ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. హారిక అండ్ హాసిని ఎంటర్టైన్మెంట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమన్ సంగీతమందిస్తున్నారు.
ఇప్పటికే సమంత, తారక్తో కలిసి నాలుగు సినిమాలు చేసింది. వీరిద్దరూ కలిసి నటించిన చిత్రాలన్నింటిలోనూ ఇద్దరేసి హీరోయిన్లు ఉండటం విశేషం.