'ఇండియన్-2' చిత్రీకరణలో క్రేన్ మీద పడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన కేసులో... విచారణకు హాజరయ్యాడు ప్రముఖ నటుడు కమల్ హాసన్. చెన్నై పోలీసుల ఎదుట ప్రమాదానికి సంబంధించిన కారణాలు వెల్లడించాడీ కోలీవుడ్ హీరో.
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఇండియన్-2' సినిమా షూటింగ్లో.. ఫిబ్రవరి 19న ప్రమాదం జరిగింది. ఇందులో ముగ్గురు మరణించారు. ఈ ప్రమాదంపై లైకా సంస్థ యజమానితో పాటు, సినీ నిర్మాతలు, క్రేన్ యజమాని, ఆపరేటర్లపై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా కమల్, దర్శకుడు శంకర్లకు విచారణకు హాజరవ్వాలని నోటీసులు జారీ చేశారు. ఫలితంగా నేడు కమల్ పోలీసుల ముందు హాజరయ్యాడు.
![Indian 2 accident: Tamil Nadu Police to summon Kamal Haasan and director Shankar for inquir](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6276532_kamal-3.jpg)
![Indian 2 accident: Tamil Nadu Police to summon Kamal Haasan and director Shankar for inquir](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6276532_kamal-2.jpg)
ఇదీ చదవండి: తండ్రిని చదివించిన కొడుకు... కారణం అదే!