ETV Bharat / sitara

''అర్జున్ రెడ్డి'ని వదులుకోకుండా ఉండాల్సింది'

విజయ్ దేవరకొండ హీరోగా వచ్చి బాక్సాఫీస్ వద్ద బ్లాక్​బస్టర్​గా నిలిచింది 'అర్జున్ రెడ్డి'. ఈ సినిమాలో నటించిన షాలినీ పాండే మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఈ మూవీలో హీరోయిన్ ఆఫర్​ను మొదట వదులుకుంది పార్వతి నాయర్. ఆ నిర్ణయానికి ప్రస్తుతం చింతిస్తున్నట్లు తెలిపింది.

author img

By

Published : Jul 26, 2021, 9:15 PM IST

parvati nair
పార్వతి నాయర్

హిట్‌ సినిమాల్లో చేయాలని ఎవరికి ఉండదు చెప్పండి.! సినిమా మంచి విజయం సాధించినప్పుడే కదా నటులకు మంచి గుర్తింపు వచ్చేది. అయితే.. అలాంటి సినిమానే చేజేతులా వదులుకుంటే ఎలా ఉంటుంది. చివరికి.. అరెరే అనవసరంగా మంచి ఛాన్స్‌ మిస్సయ్యామే అని నాలుక్కరుచుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. టాలీవుడ్‌ సంచలనం 'అర్జున్‌రెడ్డి'ని వదులుకోవడంపై హీరోయిన్‌ పార్వతీనాయర్‌ స్పందించింది.

సోషల్‌ మీడియాలో పార్వతి నాయర్ నిర్వహించిన 'ఆస్క్‌ మీ ఎనీథింగ్‌'లో భాగంగా ఓ అభిమాని "అర్జున్‌రెడ్డిలో రొమాంటిక్‌ సన్నివేశాల కారణంగానే మీరు ఆ సినిమాను నిరాకరించారన్నది నిజమేనా..? ఆ సినిమా వదులుకున్నందుకు ఇప్పుడు చింతిస్తున్నారా?" అని ప్రశ్నించాడు. దానికి పార్వతి ఇలా స్పందించింది.. "ఔను నిజమే. అయితే.. అర్జున్‌రెడ్డి ఒక మంచి చిత్రం. ఆ సినిమాను వదులుకోకుండా ఉండాల్సింది. అలాంటి మంచి సినిమా అవకాశాలు ఇంకా వస్తాయని నమ్ముతున్నా" అని ఆమె పేర్కొంది.

Parvati Nair
పార్వతి నాయర్

వివాదాలతో మొదలై బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయం సాధించిన చిత్రం 'అర్జున్‌ రెడ్డి'. ఆ సినిమా అటు హీరో విజయ్‌ దేవరకొండతో పాటు డైరెక్టర్‌ సందీప్‌రెడ్డికి హీరోయిన్‌ శాలినీ పాండేకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో విజయ్‌ దేవరకొండ రేంజ్‌ ఆకాశానికి తాకింది. ఆ చిత్రం కేవలం తెలుగు ప్రేక్షకులనే కాకుండా బాలీవుడ్‌ దృష్టిని కూడా ఆకర్షించింది. అందుకే హిందీలో 'కబీర్‌సింగ్‌' పేరుతో, తమిళ్‌లో 'ఆదిత్య వర్మ' పేరుతో రీమేక్‌ చేశారు. కాగా.. పార్వతీనాయర్‌ తమిళ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం 'ఆలంబన' చిత్రంలో నటిస్తోంది.

ఇవీ చూడండి హాట్ భామల ఘాటు పోజులు.. చూసేయండి!

హిట్‌ సినిమాల్లో చేయాలని ఎవరికి ఉండదు చెప్పండి.! సినిమా మంచి విజయం సాధించినప్పుడే కదా నటులకు మంచి గుర్తింపు వచ్చేది. అయితే.. అలాంటి సినిమానే చేజేతులా వదులుకుంటే ఎలా ఉంటుంది. చివరికి.. అరెరే అనవసరంగా మంచి ఛాన్స్‌ మిస్సయ్యామే అని నాలుక్కరుచుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. టాలీవుడ్‌ సంచలనం 'అర్జున్‌రెడ్డి'ని వదులుకోవడంపై హీరోయిన్‌ పార్వతీనాయర్‌ స్పందించింది.

సోషల్‌ మీడియాలో పార్వతి నాయర్ నిర్వహించిన 'ఆస్క్‌ మీ ఎనీథింగ్‌'లో భాగంగా ఓ అభిమాని "అర్జున్‌రెడ్డిలో రొమాంటిక్‌ సన్నివేశాల కారణంగానే మీరు ఆ సినిమాను నిరాకరించారన్నది నిజమేనా..? ఆ సినిమా వదులుకున్నందుకు ఇప్పుడు చింతిస్తున్నారా?" అని ప్రశ్నించాడు. దానికి పార్వతి ఇలా స్పందించింది.. "ఔను నిజమే. అయితే.. అర్జున్‌రెడ్డి ఒక మంచి చిత్రం. ఆ సినిమాను వదులుకోకుండా ఉండాల్సింది. అలాంటి మంచి సినిమా అవకాశాలు ఇంకా వస్తాయని నమ్ముతున్నా" అని ఆమె పేర్కొంది.

Parvati Nair
పార్వతి నాయర్

వివాదాలతో మొదలై బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయం సాధించిన చిత్రం 'అర్జున్‌ రెడ్డి'. ఆ సినిమా అటు హీరో విజయ్‌ దేవరకొండతో పాటు డైరెక్టర్‌ సందీప్‌రెడ్డికి హీరోయిన్‌ శాలినీ పాండేకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో విజయ్‌ దేవరకొండ రేంజ్‌ ఆకాశానికి తాకింది. ఆ చిత్రం కేవలం తెలుగు ప్రేక్షకులనే కాకుండా బాలీవుడ్‌ దృష్టిని కూడా ఆకర్షించింది. అందుకే హిందీలో 'కబీర్‌సింగ్‌' పేరుతో, తమిళ్‌లో 'ఆదిత్య వర్మ' పేరుతో రీమేక్‌ చేశారు. కాగా.. పార్వతీనాయర్‌ తమిళ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం 'ఆలంబన' చిత్రంలో నటిస్తోంది.

ఇవీ చూడండి హాట్ భామల ఘాటు పోజులు.. చూసేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.