ETV Bharat / sitara

'ప్యాడ్​మాన్​ సినిమాతో ఓ అడుగు ముందుకేశాం'

author img

By

Published : May 28, 2020, 9:26 PM IST

Updated : May 28, 2020, 10:02 PM IST

తాను నటించిన 'ప్యాడ్​మ్యాన్'​ చిత్రం.. సామాజిక సమస్య అయిన రుతుస్రావంపై ప్రజల్లో అవగాహన పెంచడానికి దోహదపడిందని హర్షం వ్యక్తం చేశారు బాలీవుడ్​ స్టార్​ హీరో అక్షయ్ ​కుమార్​. నేటితో ఈ సినిమా విడుదలై రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ పోస్ట్ పెట్టారు అక్షయ్.

akshay
'ప్యాడ్​మాన్​ సినిమాతో ఓ అడుగు ముందుకేశాం'

రుతుస్రావం సమయంలో వాడే శానిటరీ న్యాప్​కిన్లపై మహిళలకు అవగాహన పెంచే నేపథ్యంలో తెరకెక్కిన సినిమా 'ప్యాడ్​మాన్​'. శానిటరీ ప్యాడ్స్​ను తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొచ్చిన తమిళనాడుకు చెందిన అరుణాచలమ్ మురగనాథమ్​ బయోపిక్​గా ఈ చిత్రం రూపొందింది. ఇందులో అక్షయ్​కుమార్​, సోనమ్​కపూర్​, రాధికా ఆప్టే ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ​ సినిమా విడుదలై నేటికి రెండేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా అక్షయ్​కుమార్​ ట్విట్టర్​లో ఓ పోస్ట్ చేశారు. సామాజిక సమస్యగా చూసే రుతుస్రావంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ సినిమా దోహదపడిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ సమస్యను అధిగమించడానికి చేరువలో ఉన్నామని భావిస్తున్నట్లు తెలిపారు.

"సామాజిక సమస్య రుతుస్రావంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ సినిమా దోహదపడటం నాకు సంతోషంగా ఉంది. ఇలాంటి సామాజిక సమస్యలను అధిగమించడంలో చేరువలో ఉన్నామని భావిస్తున్నా."

-అక్షయ్​ కుమార్​, బాలీవుడ్​ హీరో.

2018లో విడుదలైన ప్యాడ్​మాన్.. సామాజిక సమస్యలను ఎత్తిచూపిన సినిమాల విభాగంలో ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డును అందుకుంది. ఆర్​ బల్కీ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి హిట్​ టాక్​ తెచ్చుకుంది.

ఇదీ చూడండి : ఆ దేశాల్లో నిషేధించిన చిత్రాలే ఇక్కడ సూపర్ హిట్లు

రుతుస్రావం సమయంలో వాడే శానిటరీ న్యాప్​కిన్లపై మహిళలకు అవగాహన పెంచే నేపథ్యంలో తెరకెక్కిన సినిమా 'ప్యాడ్​మాన్​'. శానిటరీ ప్యాడ్స్​ను తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొచ్చిన తమిళనాడుకు చెందిన అరుణాచలమ్ మురగనాథమ్​ బయోపిక్​గా ఈ చిత్రం రూపొందింది. ఇందులో అక్షయ్​కుమార్​, సోనమ్​కపూర్​, రాధికా ఆప్టే ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ​ సినిమా విడుదలై నేటికి రెండేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా అక్షయ్​కుమార్​ ట్విట్టర్​లో ఓ పోస్ట్ చేశారు. సామాజిక సమస్యగా చూసే రుతుస్రావంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ సినిమా దోహదపడిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ సమస్యను అధిగమించడానికి చేరువలో ఉన్నామని భావిస్తున్నట్లు తెలిపారు.

"సామాజిక సమస్య రుతుస్రావంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ సినిమా దోహదపడటం నాకు సంతోషంగా ఉంది. ఇలాంటి సామాజిక సమస్యలను అధిగమించడంలో చేరువలో ఉన్నామని భావిస్తున్నా."

-అక్షయ్​ కుమార్​, బాలీవుడ్​ హీరో.

2018లో విడుదలైన ప్యాడ్​మాన్.. సామాజిక సమస్యలను ఎత్తిచూపిన సినిమాల విభాగంలో ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డును అందుకుంది. ఆర్​ బల్కీ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి హిట్​ టాక్​ తెచ్చుకుంది.

ఇదీ చూడండి : ఆ దేశాల్లో నిషేధించిన చిత్రాలే ఇక్కడ సూపర్ హిట్లు

Last Updated : May 28, 2020, 10:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.