ETV Bharat / sitara

'బంగార్రాజు'లో చాలా మంది హీరోయిన్లను అందుకే పెట్టాం: చైతన్య -

బంగార్రాజు పాత్ర చేయాలంటే మొదట్లో చాలా భయమేసిందని చెప్పారు కథానాయకుడు నాగచైతన్య. క్లిష్ట పరిస్థితుల్లో కుటుంబమంతా అండగా నిలిచిందని తెలిపారు. ఇకపై నటుడిగా కొత్త ప్రయత్నాలు చేయాలనుకుంటున్నానని చెప్పారు. తండ్రి నాగార్జునతో కలిసి నాగచైతన్య నటించిన చిత్రం 'బంగార్రాజు'. సంక్రాంతి సందర్భంగా ఈనెల 14న ప్రేక్షకుల ముందుకొస్తోంది ఈ సినిమా. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు ఆయన మాటల్లోనే..

Hero Naga chaitanya Interview
నాగచైతన్య
author img

By

Published : Jan 13, 2022, 7:16 AM IST

'ఇకపై నటుడిగా కొత్త ప్రయత్నాలు చేయాలనుకుంటున్నా' అంటున్నారు కథానాయకుడు నాగచైతన్య. ప్రస్తుతం చిన్న.. పెద్ద సినిమా అన్న తేడాల్లేవని.. ప్రేక్షకులకు ఏ కథ కనెక్ట్‌ అయితే అదే పెద్ద చిత్రమని చెప్పారు. ఇప్పుడాయన తన తండ్రి నాగార్జునతో కలిసి నటించిన చిత్రం 'బంగార్రాజు'. 'సోగ్గాడే చిన్ని నాయనా'కు సీక్వెల్‌గా రూపొందింది. కల్యాణ్‌ కృష్ణ తెరకెక్కించారు. సంక్రాంతి సందర్భంగా విడుదలవుతున్న ఈ సినిమా విశేషాలను గురించి చైతన్య చెప్పాడో మీరు చదివేయండి.

తొలిసారి సంక్రాంతికి వస్తున్నట్లున్నారు కదా.. ఒత్తిడిగా ఉందా?

"ఉంది.. అదే సమయంలో ఆనందంగానూ ఉంది. ఇది నా తొలి సంక్రాంతి చిత్రమే కాదు.. నేను చేసిన తొలి సీక్వెల్‌ కూడా. సంక్రాంతి లక్ష్యంతోనే తెరకెక్కించిన చిత్రమిది. వేసవికి ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకురానని నాన్న చెబుతుండేవారు. అందుకే సినిమా ప్రారంభించినప్పటి నుంచి పండక్కి అందుకునేందుకు చకచకా చిత్రీకరణను పరుగులు పెట్టించారు. ఒకే షెడ్యూల్‌లో షూట్‌ పూర్తి చేశాం. మేమనుకున్నట్లుగా సంక్రాంతికే చిత్రాన్ని తీసుకొచ్చాం".

'బంగార్రాజు' పాత్రకి ప్రేక్షకుల్లో ఓ ఇమేజ్‌ ఉంది. ఈ పాత్ర మీరు చేయాలన్నప్పుడు ఎలా ఫీలయ్యారు?

"చాలా భయమనిపించింది. ఎందుకంటే 'సోగ్గాడు..' చిత్రంతో అందరిలో మంచి అంచనాలు ఏర్పడిపోయాయి. ఇక సీక్వెల్‌ అన్నప్పుడు అంచనాలు రెట్టింపు స్థాయిలో ఉంటాయి. అందుకే ఈ సినిమా షూట్‌కు ముందు నాన్నని, దర్శకుడు కల్యాణ్‌ని పాత్ర విషయమై చాలా డౌట్స్‌ అడిగాను. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాని అనేక సార్లు చూసుకుని.. ఆ పాత్రని సొంతం చేసుకునే ప్రయత్నం చేశాను. సెట్లోకి వెళ్లాక పాత్ర విషయంలో నాన్న, కల్యాణ్‌ చాలా సహాయం చేశారు".

ఈ చిత్రంలో చాలా మంది కథానాయికల్ని పెట్టినట్లున్నారు కదా..?

"చాలా మంది నాయికలున్నా.. వాళ్లు పాటల్లోనే కనిపిస్తారు. సినిమా మొత్తానికి ఏకైక కథానాయిక కృతి శెట్టినే. పండక్కి వచ్చే చిత్రం కదా.. ఇలాంటి మెరుపులన్నీ సినిమాలో ఉండాలి. లాజిక్కులన్నీ పక్కకు పెట్టేసి ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేయాలి. నేనిప్పటి వరకు చేసిన రొమాంటిక్‌ చిత్రాలన్నీ కాస్త రియలిస్టిక్‌గా ఉండేవి. ఈ చిత్రంలో రొమాన్స్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ కలిసి ఉంటుంది. ఇందులో నాగలక్ష్మీ అనే పాత్రలో కృతి కనిపిస్తుంది. ఊరి సర్పంచ్‌ తను. ఇందులో నేనెంత అల్లరి చేస్తానో.. తను అంతే అల్లరి చేస్తుంది. ద్వితీయార్థానికి వచ్చే సరికి ఇద్దరి మధ్య ఓ నిజాయితీతో కూడిన ప్రేమకథ మొదలవుతుంది".

ఏపీలో ఉన్న టికెట్‌ రేట్ల వల్ల ఈ చిత్రానికి ఇబ్బంది ఉందనుకుంటున్నారా?

"ఈ టికెట్‌ రేట్ల విషయంలో నేను నాన్నతో చాలా సార్లు చర్చించా. ఈ టికెట్‌ రేట్ల జీవోని ఏప్రిల్‌లో విడుదల చేశారు. అందుకే మేమీ చిత్రం అనుకున్నప్పుడు అందులోని టికెట్‌ రేట్లకు అనుగుణంగానే బడ్జెట్‌ వేసుకున్నాం. దానికి తగ్గట్లుగానే సినిమాని ముందుకు తీసుకెళ్లాం. కాబట్టి సమస్య ఏమీ లేదు. ఒకవేళ మునుపటి ధరలు ఉండి ఉంటే మాకది బోనస్‌ అయ్యి ఉండేది".

మీ మిగతా చిత్రాలకి ఈ టికెట్‌ ధరలు ఇబ్బంది కాదంటారా?

"థ్యాంక్‌ యూ' విషయంలో నిర్మాత దిల్‌రాజు చూసుకుంటారు. నేను నటుడ్ని మాత్రమే. సినిమా ప్రారంభించేటప్పుడు నిర్మాతకు ఏదైనా ఇబ్బంది ఉందనిపిస్తే.. నావైపు నుంచి నేనేమన్నా చేయగలనా? అని ఆయన్ని అడుగుతా. నా పని నేను చేసుకువెళ్తా".

కథ ఎలా ఉంటుంది? ఇద్దరు బంగార్రాజుల పాత్రలెలా ఉంటాయి?

"నేనిందులో పెద్ద బంగార్రాజు మనవడు చిన్న బంగార్రాజుగా కనిపిస్తా. ఇది నాకు సవాల్‌గా అనిపించింది. పోలికలు.. లక్షణాల విషయంలో తాతకు తగ్గ మనవడిలా ఉంటా. అల్లరి విషయంలో మాత్రం పెద్ద బంగార్రాజును మించేలా ఉంటా. ఆ అల్లరిని అదుపులో పెట్టడానికే పెద్ద బంగార్రాజు కిందకి వస్తారు. అలాగే ఊరి గుడికి సంబంధించిన మరో సమస్య కథలో ఉంటుంది. వీటన్నిటితో కథెలా ముందుకు సాగింది? అన్నది తెరపై చూడాలి. సినిమాలో నాకు, మా నాన్నకు ఇద్దరికీ సమాన ప్రాధాన్యముంటుంది. నా పాత్ర కంటే ఆయన పాత్రే ఓ మెట్టు ఎక్కువగా ఉంటుంది. కథ మొత్తం పెద్ద బంగార్రాజు, రమ్యకృష్ణ నడిపిస్తారు. ఈ చిత్రం ఆద్యంతం చాలా వినోదాత్మకంగా ఉంటుంది. సినిమా ఆరంభంలో ఓ చిన్న సునామీ ఎపిసోడ్‌ ఉంటుంది. దాన్ని మినీయేచర్స్‌తో తీశారు. అదీ ప్రేక్షకులకు చాలా నచ్చుతుంది".

'మనం' తర్వాత నాన్నతో కలిసి నటించిన చిత్రమిదే. ఎలా అనిపించింది?

"మనం' సమయంలో నాన్న, తాత ఏయన్నార్‌లతో కలిసి చేసేటప్పుడు కాస్త టెన్షన్‌ ఉండేది. కెమెరా ముందు యాక్షన్‌ అన్నప్పుడు ఎదురుగా నాన్న ఉన్నారన్న ఒత్తిడి ఉండేది. 'బంగార్రాజు'కు వచ్చేటప్పటికి ఆ భయం పోయింది. ఇద్దరం చాలా ఓపెన్‌ అయిపోయి చేసేశాం. ఈ చిత్రంలో మా ఇద్దరి కెమిస్ట్రీ బాగా వర్కవుటయ్యింది అనుకుంటున్నా".

కొత్త సినిమా విశేషాలేంటి?

"ప్రస్తుతం 'థ్యాంక్‌ యూ' సినిమా చేస్తున్నా. తుది దశ చిత్రీకరణలో ఉంది. ఇందులో నేను మూడు విభిన్నమైన గెటప్పుల్లో కనిపిస్తా. అమిర్‌ ఖాన్‌తో చేసిన 'లాల్‌ సింగ్‌ చద్దా' వేసవిలో విడుదలవుతుంది. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో అమెజాన్‌ ప్రైమ్‌ కోసం ఓ వెబ్‌ సిరీస్‌ చేస్తున్నా. ఆసక్తికరమైన మంచి హారర్‌ డ్రామా కథాంశంతో తెరకెక్కుతుంది. పరశురామ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది"

ఇటీవల మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవల్సి వచ్చింది. వాటిని ఎలా అధిగమించారు?

"ఆ సమయంలో కుటుంబమంతా అండగా నిలిచింది. ఇద్దరి మంచి కోసం తీసుకున్న నిర్ణయమది. తను హ్యాపీ. నేనూ సంతోషంగా ఉన్నా. కెరీర్‌ పరంగా ఇద్దరం హ్యాపీనే".

ఇదీ చదవండి: మలైకా అరోరాతో బ్రేకప్​.. అర్జున్​కపూర్​ క్లారిటీ

'ఇకపై నటుడిగా కొత్త ప్రయత్నాలు చేయాలనుకుంటున్నా' అంటున్నారు కథానాయకుడు నాగచైతన్య. ప్రస్తుతం చిన్న.. పెద్ద సినిమా అన్న తేడాల్లేవని.. ప్రేక్షకులకు ఏ కథ కనెక్ట్‌ అయితే అదే పెద్ద చిత్రమని చెప్పారు. ఇప్పుడాయన తన తండ్రి నాగార్జునతో కలిసి నటించిన చిత్రం 'బంగార్రాజు'. 'సోగ్గాడే చిన్ని నాయనా'కు సీక్వెల్‌గా రూపొందింది. కల్యాణ్‌ కృష్ణ తెరకెక్కించారు. సంక్రాంతి సందర్భంగా విడుదలవుతున్న ఈ సినిమా విశేషాలను గురించి చైతన్య చెప్పాడో మీరు చదివేయండి.

తొలిసారి సంక్రాంతికి వస్తున్నట్లున్నారు కదా.. ఒత్తిడిగా ఉందా?

"ఉంది.. అదే సమయంలో ఆనందంగానూ ఉంది. ఇది నా తొలి సంక్రాంతి చిత్రమే కాదు.. నేను చేసిన తొలి సీక్వెల్‌ కూడా. సంక్రాంతి లక్ష్యంతోనే తెరకెక్కించిన చిత్రమిది. వేసవికి ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకురానని నాన్న చెబుతుండేవారు. అందుకే సినిమా ప్రారంభించినప్పటి నుంచి పండక్కి అందుకునేందుకు చకచకా చిత్రీకరణను పరుగులు పెట్టించారు. ఒకే షెడ్యూల్‌లో షూట్‌ పూర్తి చేశాం. మేమనుకున్నట్లుగా సంక్రాంతికే చిత్రాన్ని తీసుకొచ్చాం".

'బంగార్రాజు' పాత్రకి ప్రేక్షకుల్లో ఓ ఇమేజ్‌ ఉంది. ఈ పాత్ర మీరు చేయాలన్నప్పుడు ఎలా ఫీలయ్యారు?

"చాలా భయమనిపించింది. ఎందుకంటే 'సోగ్గాడు..' చిత్రంతో అందరిలో మంచి అంచనాలు ఏర్పడిపోయాయి. ఇక సీక్వెల్‌ అన్నప్పుడు అంచనాలు రెట్టింపు స్థాయిలో ఉంటాయి. అందుకే ఈ సినిమా షూట్‌కు ముందు నాన్నని, దర్శకుడు కల్యాణ్‌ని పాత్ర విషయమై చాలా డౌట్స్‌ అడిగాను. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాని అనేక సార్లు చూసుకుని.. ఆ పాత్రని సొంతం చేసుకునే ప్రయత్నం చేశాను. సెట్లోకి వెళ్లాక పాత్ర విషయంలో నాన్న, కల్యాణ్‌ చాలా సహాయం చేశారు".

ఈ చిత్రంలో చాలా మంది కథానాయికల్ని పెట్టినట్లున్నారు కదా..?

"చాలా మంది నాయికలున్నా.. వాళ్లు పాటల్లోనే కనిపిస్తారు. సినిమా మొత్తానికి ఏకైక కథానాయిక కృతి శెట్టినే. పండక్కి వచ్చే చిత్రం కదా.. ఇలాంటి మెరుపులన్నీ సినిమాలో ఉండాలి. లాజిక్కులన్నీ పక్కకు పెట్టేసి ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేయాలి. నేనిప్పటి వరకు చేసిన రొమాంటిక్‌ చిత్రాలన్నీ కాస్త రియలిస్టిక్‌గా ఉండేవి. ఈ చిత్రంలో రొమాన్స్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ కలిసి ఉంటుంది. ఇందులో నాగలక్ష్మీ అనే పాత్రలో కృతి కనిపిస్తుంది. ఊరి సర్పంచ్‌ తను. ఇందులో నేనెంత అల్లరి చేస్తానో.. తను అంతే అల్లరి చేస్తుంది. ద్వితీయార్థానికి వచ్చే సరికి ఇద్దరి మధ్య ఓ నిజాయితీతో కూడిన ప్రేమకథ మొదలవుతుంది".

ఏపీలో ఉన్న టికెట్‌ రేట్ల వల్ల ఈ చిత్రానికి ఇబ్బంది ఉందనుకుంటున్నారా?

"ఈ టికెట్‌ రేట్ల విషయంలో నేను నాన్నతో చాలా సార్లు చర్చించా. ఈ టికెట్‌ రేట్ల జీవోని ఏప్రిల్‌లో విడుదల చేశారు. అందుకే మేమీ చిత్రం అనుకున్నప్పుడు అందులోని టికెట్‌ రేట్లకు అనుగుణంగానే బడ్జెట్‌ వేసుకున్నాం. దానికి తగ్గట్లుగానే సినిమాని ముందుకు తీసుకెళ్లాం. కాబట్టి సమస్య ఏమీ లేదు. ఒకవేళ మునుపటి ధరలు ఉండి ఉంటే మాకది బోనస్‌ అయ్యి ఉండేది".

మీ మిగతా చిత్రాలకి ఈ టికెట్‌ ధరలు ఇబ్బంది కాదంటారా?

"థ్యాంక్‌ యూ' విషయంలో నిర్మాత దిల్‌రాజు చూసుకుంటారు. నేను నటుడ్ని మాత్రమే. సినిమా ప్రారంభించేటప్పుడు నిర్మాతకు ఏదైనా ఇబ్బంది ఉందనిపిస్తే.. నావైపు నుంచి నేనేమన్నా చేయగలనా? అని ఆయన్ని అడుగుతా. నా పని నేను చేసుకువెళ్తా".

కథ ఎలా ఉంటుంది? ఇద్దరు బంగార్రాజుల పాత్రలెలా ఉంటాయి?

"నేనిందులో పెద్ద బంగార్రాజు మనవడు చిన్న బంగార్రాజుగా కనిపిస్తా. ఇది నాకు సవాల్‌గా అనిపించింది. పోలికలు.. లక్షణాల విషయంలో తాతకు తగ్గ మనవడిలా ఉంటా. అల్లరి విషయంలో మాత్రం పెద్ద బంగార్రాజును మించేలా ఉంటా. ఆ అల్లరిని అదుపులో పెట్టడానికే పెద్ద బంగార్రాజు కిందకి వస్తారు. అలాగే ఊరి గుడికి సంబంధించిన మరో సమస్య కథలో ఉంటుంది. వీటన్నిటితో కథెలా ముందుకు సాగింది? అన్నది తెరపై చూడాలి. సినిమాలో నాకు, మా నాన్నకు ఇద్దరికీ సమాన ప్రాధాన్యముంటుంది. నా పాత్ర కంటే ఆయన పాత్రే ఓ మెట్టు ఎక్కువగా ఉంటుంది. కథ మొత్తం పెద్ద బంగార్రాజు, రమ్యకృష్ణ నడిపిస్తారు. ఈ చిత్రం ఆద్యంతం చాలా వినోదాత్మకంగా ఉంటుంది. సినిమా ఆరంభంలో ఓ చిన్న సునామీ ఎపిసోడ్‌ ఉంటుంది. దాన్ని మినీయేచర్స్‌తో తీశారు. అదీ ప్రేక్షకులకు చాలా నచ్చుతుంది".

'మనం' తర్వాత నాన్నతో కలిసి నటించిన చిత్రమిదే. ఎలా అనిపించింది?

"మనం' సమయంలో నాన్న, తాత ఏయన్నార్‌లతో కలిసి చేసేటప్పుడు కాస్త టెన్షన్‌ ఉండేది. కెమెరా ముందు యాక్షన్‌ అన్నప్పుడు ఎదురుగా నాన్న ఉన్నారన్న ఒత్తిడి ఉండేది. 'బంగార్రాజు'కు వచ్చేటప్పటికి ఆ భయం పోయింది. ఇద్దరం చాలా ఓపెన్‌ అయిపోయి చేసేశాం. ఈ చిత్రంలో మా ఇద్దరి కెమిస్ట్రీ బాగా వర్కవుటయ్యింది అనుకుంటున్నా".

కొత్త సినిమా విశేషాలేంటి?

"ప్రస్తుతం 'థ్యాంక్‌ యూ' సినిమా చేస్తున్నా. తుది దశ చిత్రీకరణలో ఉంది. ఇందులో నేను మూడు విభిన్నమైన గెటప్పుల్లో కనిపిస్తా. అమిర్‌ ఖాన్‌తో చేసిన 'లాల్‌ సింగ్‌ చద్దా' వేసవిలో విడుదలవుతుంది. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో అమెజాన్‌ ప్రైమ్‌ కోసం ఓ వెబ్‌ సిరీస్‌ చేస్తున్నా. ఆసక్తికరమైన మంచి హారర్‌ డ్రామా కథాంశంతో తెరకెక్కుతుంది. పరశురామ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది"

ఇటీవల మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవల్సి వచ్చింది. వాటిని ఎలా అధిగమించారు?

"ఆ సమయంలో కుటుంబమంతా అండగా నిలిచింది. ఇద్దరి మంచి కోసం తీసుకున్న నిర్ణయమది. తను హ్యాపీ. నేనూ సంతోషంగా ఉన్నా. కెరీర్‌ పరంగా ఇద్దరం హ్యాపీనే".

ఇదీ చదవండి: మలైకా అరోరాతో బ్రేకప్​.. అర్జున్​కపూర్​ క్లారిటీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.