ETV Bharat / sitara

పవన్​ చిత్రంపై హరీశ్ ట్వీట్.. అర్థమదేనా? - పీఎస్​పీకే 28

పవన్ కల్యాణ్​ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్​డేట్ ఇచ్చారు హరీశ్.

pawan
పవన్​
author img

By

Published : Jun 10, 2021, 5:49 PM IST

పవర్​స్టార్ పవన్​కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కనుంది. కొంతకాలం క్రితమే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించినా షూటింగ్​ మాత్రం ప్రారంభంకాలేదు. ఇప్పటికే పవన్ చేతిలో 'హరిహర వీరమల్లు', 'అయ్యప్పనుమ్ కోషియుమ్​' రీమేక్ చిత్రాలు ఉండటం వల్ల ఈ సినిమా చిత్రీకరణ మరింత ఆలస్యమవుతుందని అంతా భావించారు. కానీ తాజాగా హరీశ్ పెట్టిన పోస్ట్​తో ఈ అనుమానం పటాపంచలైంది.

తాజాగా హరీశ్​ 'తిరిగి పని ప్రారంభించడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నా' అంటూ పవన్​ కల్యాణ్​ 'గబ్బర్​సింగ్'​ చిత్రీకరణకు సంబంధించిన ఫొటోను పోస్ట్ చేశాడు. దీంతో వీరిద్దరి కాంబోలోని కొత్త సినిమా త్వరలోనే షూటింగ్​ ప్రారంభించుకోనున్నట్లు అర్థమవుతోంది. ఈ ట్వీట్​తో అభిమానుల సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. 'గబ్బర్​సింగ్'​కు మించిన విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటూ వారు పోస్టులు పెడుతున్నారు.

ఇప్పటివరకు కనిపించని పాత్రను ఈ సినిమాలో పవన్ చేయనున్నారు. 'సంచారి' అనే టైటిల్​ పరిశీలనలో ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, దేవి శ్రీప్రసాద్ సంగీతమందిస్తున్నారు.

ఇవీ చూడండి: అల్లు అర్జున్ 'బద్రీనాథ్​'కు పదేళ్లు

పవర్​స్టార్ పవన్​కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కనుంది. కొంతకాలం క్రితమే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించినా షూటింగ్​ మాత్రం ప్రారంభంకాలేదు. ఇప్పటికే పవన్ చేతిలో 'హరిహర వీరమల్లు', 'అయ్యప్పనుమ్ కోషియుమ్​' రీమేక్ చిత్రాలు ఉండటం వల్ల ఈ సినిమా చిత్రీకరణ మరింత ఆలస్యమవుతుందని అంతా భావించారు. కానీ తాజాగా హరీశ్ పెట్టిన పోస్ట్​తో ఈ అనుమానం పటాపంచలైంది.

తాజాగా హరీశ్​ 'తిరిగి పని ప్రారంభించడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నా' అంటూ పవన్​ కల్యాణ్​ 'గబ్బర్​సింగ్'​ చిత్రీకరణకు సంబంధించిన ఫొటోను పోస్ట్ చేశాడు. దీంతో వీరిద్దరి కాంబోలోని కొత్త సినిమా త్వరలోనే షూటింగ్​ ప్రారంభించుకోనున్నట్లు అర్థమవుతోంది. ఈ ట్వీట్​తో అభిమానుల సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. 'గబ్బర్​సింగ్'​కు మించిన విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటూ వారు పోస్టులు పెడుతున్నారు.

ఇప్పటివరకు కనిపించని పాత్రను ఈ సినిమాలో పవన్ చేయనున్నారు. 'సంచారి' అనే టైటిల్​ పరిశీలనలో ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, దేవి శ్రీప్రసాద్ సంగీతమందిస్తున్నారు.

ఇవీ చూడండి: అల్లు అర్జున్ 'బద్రీనాథ్​'కు పదేళ్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.