ETV Bharat / sitara

హాట్ టాపిక్​గా మారిన శింబు-త్రిష పెళ్లి!

author img

By

Published : Oct 16, 2020, 10:21 AM IST

ప్రముఖ నటీనటులు శింబు, త్రిష త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నారంటూ మరోసారి వార్తలు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇదే విషయమై శింబు తండ్రి రాజేందర్​ను స్పందించమని కోరగా.. ఆయన ఎలాంటి సమాధానం చెప్పకుండా ప్రశ్నను దాటవేశారు.

Fans doubt as T Rajendar evades questions on Simbu Trishas Wedding
హాట్ టాపిక్​గా మారిన శింబు-త్రిష పెళ్లి!

'విన్నైతండి వరువాయ' (తెలుగులో 'ఏమాయ చేశావే') చిత్రంలో కలిసి నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు నటీనటులు శింబు, త్రిష. ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ మేనన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వీరి మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసి చాలామంది వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనుకున్నారు. వీరు కలిసి ఏడడుగులు వేయనున్నారంటూ గతంలో ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ తాము మంచి స్నేహితులమే అని ఈ జంట సమాధానమిచ్చింది.

కాగా, లాక్‌డౌన్‌ సమయంలో త్రిష-శింబు కలిసి 'కార్తీక్‌ డయల్‌ సేతా యెన్‌' అనే షార్ట్‌ ఫిల్మ్‌ కోసం పనిచేశారు. అయితే ఈ ఏడాది డిసెంబర్‌లో ఓ శుభవార్త చెబుతానంటూ శింబు ఇటీవల ప్రకటించారు. దీంతో త్రిష-శింబు రిలేషన్‌లో ఉన్నారని, వీరిద్దరూ అతి త్వరలోనే వివాహం చేసుకోనున్నారంటూ మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరి రిలేషన్‌ గురించి నెట్టింట్లో పలు పోస్టులు కూడా దర్శనమిస్తున్నాయి.

తాజాగా తమిళ నిర్మాతల మండలి ఎన్నికల్లో ఈ ఏడాది శింబు తండ్రి రాజేందర్‌‌‌ పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇందులో భాగంగా ఓ విలేకరి‌.. శింబు-త్రిష పెళ్లి‌ గురించి స్పందించమని కోరగా.. ఆయన‌ మాత్రం ఎలాంటి సమాధానం చెప్పకుండా ఆ ప్రశ్నను దాటవేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'విన్నైతండి వరువాయ' (తెలుగులో 'ఏమాయ చేశావే') చిత్రంలో కలిసి నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు నటీనటులు శింబు, త్రిష. ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ మేనన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వీరి మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసి చాలామంది వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనుకున్నారు. వీరు కలిసి ఏడడుగులు వేయనున్నారంటూ గతంలో ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ తాము మంచి స్నేహితులమే అని ఈ జంట సమాధానమిచ్చింది.

కాగా, లాక్‌డౌన్‌ సమయంలో త్రిష-శింబు కలిసి 'కార్తీక్‌ డయల్‌ సేతా యెన్‌' అనే షార్ట్‌ ఫిల్మ్‌ కోసం పనిచేశారు. అయితే ఈ ఏడాది డిసెంబర్‌లో ఓ శుభవార్త చెబుతానంటూ శింబు ఇటీవల ప్రకటించారు. దీంతో త్రిష-శింబు రిలేషన్‌లో ఉన్నారని, వీరిద్దరూ అతి త్వరలోనే వివాహం చేసుకోనున్నారంటూ మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరి రిలేషన్‌ గురించి నెట్టింట్లో పలు పోస్టులు కూడా దర్శనమిస్తున్నాయి.

తాజాగా తమిళ నిర్మాతల మండలి ఎన్నికల్లో ఈ ఏడాది శింబు తండ్రి రాజేందర్‌‌‌ పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇందులో భాగంగా ఓ విలేకరి‌.. శింబు-త్రిష పెళ్లి‌ గురించి స్పందించమని కోరగా.. ఆయన‌ మాత్రం ఎలాంటి సమాధానం చెప్పకుండా ఆ ప్రశ్నను దాటవేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.