ETV Bharat / sitara

ఓటీటీ వేదికలపై వీళ్లే నయా 'గేమ్​ ఛేంజర్లు'

author img

By

Published : Nov 17, 2020, 5:30 PM IST

'ఓటీటీ సినిమా'.. ఇప్పుడు టాలీవుడ్‌, బాలీవుడ్‌.. ఏ వుడ్‌ అయినా ఇదే మాట వినిపిస్తోంది. వెండితెరపై దర్శకులుగా నిరూపించుకున్న వాళ్ల నుంచి ఆర్టిస్టులుగా రాణిస్తున్న అందరూ ఓటీటీవైపే చూస్తున్నారు. ఇలాంటి కరోనా కాలంలో వినోదాన్ని పంచుతూ.. వెండితెర, బుల్లితెరలకు పోటీగా నిలుస్తోంది ఓటీటీ. అందుకే ఇది టాలెంట్​కు మార్గదర్శిగా, నటనకు కేరాఫ్​ అడ్రస్​గా, ప్రయోగాత్మక పాత్రలకు సరికొత్త నిర్వచనంగా మారింది. అంతేకాదు ఈ స్మార్ట్​ వేదికను నమ్ముకున్న నటీనటులనూ గేమ్​ ఛేంజర్లుగా మార్చేస్తోంది. బోలెడంత పేరునూ తెచ్చిపెడుతోంది. మరి ఈ ఏడాదిలో సినీహీరోలంత ఇమేజ్​ను సొంతం చేసుకున్న టాప్​-7 నటీనటులు ఎవరంటే?

ott latest news
ఓటీటీ వేదికలపై నయా గేమ్​ ఛేంజర్లు వీళ్లే..

కరోనా దెబ్బకు థియేటర్లన్నీ మూతపడ్డాయి. వినోదమే కష్టమనే సమయంలో ప్రజలను అలరించేందుకు ఓటీటీ చక్కని వేదికైంది. ఇప్పటివరకు వెండితెర, బుల్లితెర మాత్రమే ఎందరినో స్టార్​లను చేసింది. అయితే ఆ సత్తా తనకూ ఉందంటూ ఓటీటీ.. ఈ కరోనా కాలంలో కొందరిని ప్రజలకు చేరువ చేసింది. సామాన్య నటుల్ని కాస్త స్టార్​లను చేసింది. అందుకే ఓటీటీ అంటే 'ఓవర్​ ద టాప్​' మాత్రమే కాదు.. టాలెంట్​ను గుర్తించడంలోనూ టాపే అనేలా మారింది. ఓటీటీ వేదికల వల్ల ఈ ఏడాది తమ గ్రాఫ్​ మార్చుకున్న కొందరి నటీనటుల గురించే ఈ కథనం.

ప్రతీక్​ గాంధీ

గుజరాత్​లో థియేటర్​ ఆర్టిస్ట్​గా పేరున్న ఇతడికి బాలీవుడ్​లో అడుగుపెట్టాక పెద్దగా అవకాశాలు రాలేదు. 'లవ్​యాత్రి', 'మిత్రోన్' లాంటి సినిమాల్లో చిన్న పాత్రల్లో చేసినా సరే గుర్తింపు లభించలేదు. పెద్దగా పేరు తెలియని ఇతడిని.. ఈ ఏడాది ఓటీటీని షేక్​ చేసిన 'స్కామ్​ 1992' ఒక్కసారిగా క్రేజ్ తీసుకొచ్చేసింది. వెండితెర ఇవ్వలేని పేరును ఓటీటీ ఒక్క సిరీస్​తో అందించింది. ఇతడు ప్రతీక్​ గాంధీయే అయినా నటించిన హర్షద్​ మెహతా పాత్ర ఇతడికి అసలు పేరుగా మారిపోయింది.

OTT platform actors
ప్రతీక్​ గాంధీ

ఐఎమ్​డీబీ రేటింగ్​లోనూ దుమ్ములేపిన ఈ సిరీస్​.. స్టాక్​ బ్రోకర్​ హర్షద్​ మెహతా జీవితం ఆధారంగా రూపొందించారు. ఇతడితో పాటు సతీష్​ కౌశిక్​, శ్రేయ ధన్వంతరి, నిఖిల్​ ద్వివేది, అనంత్​ నారాయణ్​ మహదేవన్​ అద్భుతంగా నటించారు. ప్రతీక్​ పాత్ర మాత్రం సిరీస్​ మొత్తానికే హైలెట్​గా నిలిచింది.

అభిషేక్​ బెనర్జీ

ఇతడిని అభిషేక్ బెనర్జీ​ అనే కంటే హథోడా త్యాగి అంటే అందరూ గుర్తుపడతారేమో. చాలా రోజులపాటు బాలీవుడ్​లో చిన్న చిన్న పాత్రలు​ చేసినా పెద్దగా పేరు రాలేదు. ఆమిర్​ ఖాన్​ 'రంగ్​ దే బసంతి' సినిమాతో అరంగేట్రం చేసిన ఇతడు.. ఆ తర్వాత పలు సినిమాల్లో క్యారెక్టర్​ ఆర్టిస్ట్​గా నటించాడు. స్త్రీ, డ్రీమ్​గర్ల్​, బాలా లాంటి సినిమాల్లోనూ మెరిశాడు. అయితే 'పాతాళ్ లోక్​' వెబ్​సిరీస్​ ఇతడిని ఒక్కసారిగా గుర్తింపు తీసుకొచ్చింది. తనలోని నటనా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పింది.

OTT platform actors
అభిషేక్​ బెనర్జీ

దివ్వేందు శర్మ

అమెజాన్​లోని 'మీర్జాపుర్'​ వెబ్​సిరీస్​ ఎంతగా హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వివిధ భాషల్లోని డబ్బింగ్​లకూ సూపర్​ క్రేజ్ వచ్చింది.​ అయితే ఈ సిరీస్​లో ప్రతినాయక లక్షణాలున్న పాత్ర మున్నా భయ్యాగా కనిపించిన దివ్వేందు శర్మకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. గతంలో ఎన్నో పాత్రలు చేశాడు. ఉద్యోగి నుంచి రొమాంటిక్​ లవర్​బాయ్​గా అన్ని రోల్స్​లోనూ అదరగొట్టాడు. అయితే అవన్నీ ఓవైపు మున్నా భయ్యా ఒక్కటే మరోవైపు అన్నంతగా ఆడియన్స్​ మనసు దోచేశాడు​. ఈ దెబ్బతో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. త్వరలో 'బిచో కా ఖేల్​' క్రైమ్​ థ్రిల్లర్​ సిరీస్​లోనూ కనువిందు చేయనున్నాడు.

OTT platform actors
దివ్వేందు శర్మ

నమిత్​ దాస్​

స్మార్ట్​తెరపై దుమ్ములేపిన మరో వెబ్​ సిరీస్​ 'ఆర్య'. తల్లిపాత్రలో కనిపించిన సుస్మితా సేన్​, ఓ క్రైమ్​ బాస్​ మధ్య జరిగిన ఘర్షణను ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఈ సస్పెన్స్​ థ్రిల్లర్​ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఇందులో జవహర్​ పాత్ర పోషించిన నమిత్​ దాస్​కూ మంచి పేరొచ్చింది. సుస్మితా పాత్ర తర్వాత ఇతడి రోల్​కే ప్రేక్షకులు బాగా కనెక్ట్​ అయ్యారు. చాలా సినిమాలు, షోలలో నమిత్​ కనిపించినా.. ఈ ఏడాది మాత్రం అతడి దశ మారిపోయింది. తనలోని నటనకు కొత్త పుంతలు తొక్కించే అవకాశాన్ని కల్పించింది. 'ఆర్య', 'ఏ సూటబుల్​ బాయ్​', 'మాఫియా' విజయాలతో ఈ ఏడాది నమిత్​ గ్రాఫ్​ అమాంతం దూసుకెళ్లింది.

OTT platform actors
నమిత్​ దాస్​

శ్వేతా త్రిపాఠి

'మీర్జాపుర్​2'లో గోలూ పాత్రలో నటించిన శ్వేతా త్రిపాఠి.. ఈ ఏడాది ఓటీటీ తారల జాబితాలో చోటు దక్కించుకుంది. 'గోనే గేమ్​', 'కార్గో అండే', నవాజుద్దీన్​ సిద్ధిఖీ నటించిన 'రాత్​ అఖేలీ హై'.. ఆమెకు మంచి పేరు తెచ్చాయి. వీటితో పాటు 'మసాన్​', 'గోన్​ కేశ్'​ సినిమాల్లోని ఆమె నటనకు అభిమానుల ఫిదా అయిపోయారు.

OTT platform actors
శ్వేతా త్రిపాఠి

రసికా దుగ్గల్​

అందాలు ఆరబోయడం వెండితెరపైనే కాదు.. ఓటీటీ వేదికలపైనా కొందరు నటీమణులు ప్రదర్శించారు. అయితే నటన, అభినయం, బోల్డ్ రోల్స్​లో తనదైన మార్క్​తో ఇమేజ్​ను​ పెంచుకుంది రసికా దుగ్గల్​. 'లూట్​కేస్'​, 'ఏ సూటబుల్​ బాయ్'​కు ఆడియన్స్​ నుంచి పాజిటివ్​ స్పందన వస్తే.. మీర్జాపుర్​ సిరీస్​తో ఆమె నటనకు డై హార్డ్​ ఫ్యాన్స్​ అయిపోయారు.

OTT platform actors
రసికా దుగ్గల్​

పంకజ్​ త్రిపాఠి

వెండితెర విలువలతో రూపొందినా.. ఓటీటీలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం సాధించింది 'గుంజన్​ సక్సేనా' సినిమా. అయితే ఇది మిక్స్​డ్​ రివ్యూలు, కాంట్రవర్సీలకు కేరాఫ్​ అడ్రస్​ అయింది. ఇందులో పంకజ్​ త్రిపాఠి నటనకు మాత్రం ఫుల్​మార్కులే పడ్డాయి. తనదైన నటనతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశాడు. 'మీర్జాపుర్'​లోనూ ఖలీన్​ భయ్యాగా అద్భుతంగా చేశాడు. అంగ్రేజీ మీడియం, క్రిస్​ హెమ్స్​వోర్త్​ 'ఎక్ష్​ట్రాక్షన్'​ ఇతడి ఇమేజ్​ను తారాస్థాయికి చేర్చాయి.

OTT platform actors
పంకజ్​ త్రిపాఠి

కరోనా దెబ్బకు థియేటర్లన్నీ మూతపడ్డాయి. వినోదమే కష్టమనే సమయంలో ప్రజలను అలరించేందుకు ఓటీటీ చక్కని వేదికైంది. ఇప్పటివరకు వెండితెర, బుల్లితెర మాత్రమే ఎందరినో స్టార్​లను చేసింది. అయితే ఆ సత్తా తనకూ ఉందంటూ ఓటీటీ.. ఈ కరోనా కాలంలో కొందరిని ప్రజలకు చేరువ చేసింది. సామాన్య నటుల్ని కాస్త స్టార్​లను చేసింది. అందుకే ఓటీటీ అంటే 'ఓవర్​ ద టాప్​' మాత్రమే కాదు.. టాలెంట్​ను గుర్తించడంలోనూ టాపే అనేలా మారింది. ఓటీటీ వేదికల వల్ల ఈ ఏడాది తమ గ్రాఫ్​ మార్చుకున్న కొందరి నటీనటుల గురించే ఈ కథనం.

ప్రతీక్​ గాంధీ

గుజరాత్​లో థియేటర్​ ఆర్టిస్ట్​గా పేరున్న ఇతడికి బాలీవుడ్​లో అడుగుపెట్టాక పెద్దగా అవకాశాలు రాలేదు. 'లవ్​యాత్రి', 'మిత్రోన్' లాంటి సినిమాల్లో చిన్న పాత్రల్లో చేసినా సరే గుర్తింపు లభించలేదు. పెద్దగా పేరు తెలియని ఇతడిని.. ఈ ఏడాది ఓటీటీని షేక్​ చేసిన 'స్కామ్​ 1992' ఒక్కసారిగా క్రేజ్ తీసుకొచ్చేసింది. వెండితెర ఇవ్వలేని పేరును ఓటీటీ ఒక్క సిరీస్​తో అందించింది. ఇతడు ప్రతీక్​ గాంధీయే అయినా నటించిన హర్షద్​ మెహతా పాత్ర ఇతడికి అసలు పేరుగా మారిపోయింది.

OTT platform actors
ప్రతీక్​ గాంధీ

ఐఎమ్​డీబీ రేటింగ్​లోనూ దుమ్ములేపిన ఈ సిరీస్​.. స్టాక్​ బ్రోకర్​ హర్షద్​ మెహతా జీవితం ఆధారంగా రూపొందించారు. ఇతడితో పాటు సతీష్​ కౌశిక్​, శ్రేయ ధన్వంతరి, నిఖిల్​ ద్వివేది, అనంత్​ నారాయణ్​ మహదేవన్​ అద్భుతంగా నటించారు. ప్రతీక్​ పాత్ర మాత్రం సిరీస్​ మొత్తానికే హైలెట్​గా నిలిచింది.

అభిషేక్​ బెనర్జీ

ఇతడిని అభిషేక్ బెనర్జీ​ అనే కంటే హథోడా త్యాగి అంటే అందరూ గుర్తుపడతారేమో. చాలా రోజులపాటు బాలీవుడ్​లో చిన్న చిన్న పాత్రలు​ చేసినా పెద్దగా పేరు రాలేదు. ఆమిర్​ ఖాన్​ 'రంగ్​ దే బసంతి' సినిమాతో అరంగేట్రం చేసిన ఇతడు.. ఆ తర్వాత పలు సినిమాల్లో క్యారెక్టర్​ ఆర్టిస్ట్​గా నటించాడు. స్త్రీ, డ్రీమ్​గర్ల్​, బాలా లాంటి సినిమాల్లోనూ మెరిశాడు. అయితే 'పాతాళ్ లోక్​' వెబ్​సిరీస్​ ఇతడిని ఒక్కసారిగా గుర్తింపు తీసుకొచ్చింది. తనలోని నటనా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పింది.

OTT platform actors
అభిషేక్​ బెనర్జీ

దివ్వేందు శర్మ

అమెజాన్​లోని 'మీర్జాపుర్'​ వెబ్​సిరీస్​ ఎంతగా హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వివిధ భాషల్లోని డబ్బింగ్​లకూ సూపర్​ క్రేజ్ వచ్చింది.​ అయితే ఈ సిరీస్​లో ప్రతినాయక లక్షణాలున్న పాత్ర మున్నా భయ్యాగా కనిపించిన దివ్వేందు శర్మకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. గతంలో ఎన్నో పాత్రలు చేశాడు. ఉద్యోగి నుంచి రొమాంటిక్​ లవర్​బాయ్​గా అన్ని రోల్స్​లోనూ అదరగొట్టాడు. అయితే అవన్నీ ఓవైపు మున్నా భయ్యా ఒక్కటే మరోవైపు అన్నంతగా ఆడియన్స్​ మనసు దోచేశాడు​. ఈ దెబ్బతో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. త్వరలో 'బిచో కా ఖేల్​' క్రైమ్​ థ్రిల్లర్​ సిరీస్​లోనూ కనువిందు చేయనున్నాడు.

OTT platform actors
దివ్వేందు శర్మ

నమిత్​ దాస్​

స్మార్ట్​తెరపై దుమ్ములేపిన మరో వెబ్​ సిరీస్​ 'ఆర్య'. తల్లిపాత్రలో కనిపించిన సుస్మితా సేన్​, ఓ క్రైమ్​ బాస్​ మధ్య జరిగిన ఘర్షణను ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఈ సస్పెన్స్​ థ్రిల్లర్​ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఇందులో జవహర్​ పాత్ర పోషించిన నమిత్​ దాస్​కూ మంచి పేరొచ్చింది. సుస్మితా పాత్ర తర్వాత ఇతడి రోల్​కే ప్రేక్షకులు బాగా కనెక్ట్​ అయ్యారు. చాలా సినిమాలు, షోలలో నమిత్​ కనిపించినా.. ఈ ఏడాది మాత్రం అతడి దశ మారిపోయింది. తనలోని నటనకు కొత్త పుంతలు తొక్కించే అవకాశాన్ని కల్పించింది. 'ఆర్య', 'ఏ సూటబుల్​ బాయ్​', 'మాఫియా' విజయాలతో ఈ ఏడాది నమిత్​ గ్రాఫ్​ అమాంతం దూసుకెళ్లింది.

OTT platform actors
నమిత్​ దాస్​

శ్వేతా త్రిపాఠి

'మీర్జాపుర్​2'లో గోలూ పాత్రలో నటించిన శ్వేతా త్రిపాఠి.. ఈ ఏడాది ఓటీటీ తారల జాబితాలో చోటు దక్కించుకుంది. 'గోనే గేమ్​', 'కార్గో అండే', నవాజుద్దీన్​ సిద్ధిఖీ నటించిన 'రాత్​ అఖేలీ హై'.. ఆమెకు మంచి పేరు తెచ్చాయి. వీటితో పాటు 'మసాన్​', 'గోన్​ కేశ్'​ సినిమాల్లోని ఆమె నటనకు అభిమానుల ఫిదా అయిపోయారు.

OTT platform actors
శ్వేతా త్రిపాఠి

రసికా దుగ్గల్​

అందాలు ఆరబోయడం వెండితెరపైనే కాదు.. ఓటీటీ వేదికలపైనా కొందరు నటీమణులు ప్రదర్శించారు. అయితే నటన, అభినయం, బోల్డ్ రోల్స్​లో తనదైన మార్క్​తో ఇమేజ్​ను​ పెంచుకుంది రసికా దుగ్గల్​. 'లూట్​కేస్'​, 'ఏ సూటబుల్​ బాయ్'​కు ఆడియన్స్​ నుంచి పాజిటివ్​ స్పందన వస్తే.. మీర్జాపుర్​ సిరీస్​తో ఆమె నటనకు డై హార్డ్​ ఫ్యాన్స్​ అయిపోయారు.

OTT platform actors
రసికా దుగ్గల్​

పంకజ్​ త్రిపాఠి

వెండితెర విలువలతో రూపొందినా.. ఓటీటీలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం సాధించింది 'గుంజన్​ సక్సేనా' సినిమా. అయితే ఇది మిక్స్​డ్​ రివ్యూలు, కాంట్రవర్సీలకు కేరాఫ్​ అడ్రస్​ అయింది. ఇందులో పంకజ్​ త్రిపాఠి నటనకు మాత్రం ఫుల్​మార్కులే పడ్డాయి. తనదైన నటనతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశాడు. 'మీర్జాపుర్'​లోనూ ఖలీన్​ భయ్యాగా అద్భుతంగా చేశాడు. అంగ్రేజీ మీడియం, క్రిస్​ హెమ్స్​వోర్త్​ 'ఎక్ష్​ట్రాక్షన్'​ ఇతడి ఇమేజ్​ను తారాస్థాయికి చేర్చాయి.

OTT platform actors
పంకజ్​ త్రిపాఠి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.