తన సినిమాలతో ఎంతోమంది కొత్తవారిని టాలీవుడ్కు పరిచయం చేసిన తేజ.. ప్రముఖ దర్శకుడిగా విశేష గుర్తింపు తెచ్చుకున్నారు. చివరగా 'నేనే రాజు నేనే మంత్రి'తో హిట్ కొట్టిన ఆయన.. తన తొలి సినిమా 'చిత్రం'కు సీక్వెల్గా.. 'చిత్రం 1.1' ఉంటుందని ఇటీవల ప్రకటించారు. ఈ సినిమాతో తన కుమారుడు అమితవ్ తేజ్ను హీరోగా పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఇందుకోసం అమితవ్ విదేశాల్లో శిక్షణ కూడా తీసుకున్నాడని తెలిసింది.
ఈ నెల 18న సినిమా షూటింగ్ ప్రారంభంకానున్నట్లు వినికిడి. దీనికి సంబంధించిన అధికార ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశముంది. దీని తర్వాత తేజ.. హీరోలు రానా, గోపీచంద్తో వేర్వేరుగా చిత్రాలు చేయనున్నారు.
స్వతహాగా కెమెరామెన్ అయిన తేజ.. 2000లో 'చిత్రం'తో డైరెక్టర్గా మారారు. ఉదయ్ కిరణ్, రీమాసేన్లను హీరోహీరోయిన్లుగా, ఆర్పీ పట్నాయక్ను సంగీత దర్శకుడిగా ఈ సినిమాతోనే పరిచయం చేశారు.
ఇదీ చూడండి: 20 ఏళ్ల తర్వాత 'చిత్రం'కు సీక్వెల్.. తేజ ప్రకటన