ETV Bharat / sitara

'మణికర్ణిక'ను 100శాతం నేనే షూట్‌ చేశా:క్రిష్‌

author img

By

Published : Dec 19, 2020, 10:38 AM IST

'మణికర్ణిక' సినిమా సమయంలో కంగనా రనౌత్ -క్రిష్​ మధ్య జరిగిన వివాదం ఏమిటి? ఈ సినిమా దర్శకత్వాన్ని ఉద్దేశిస్తూ.. అప్పట్లో కంగన ఎందుకు అలా ట్వీట్‌ చేశారు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెబుతూ సదరు వివాదం గురించి తాజాగా దర్శకుడు క్రిష్‌ స్పందించారు.

director krish given clarity about manikarnika movie problems with kangana ranuth
'మణికర్ణిక'ను 100శాతం నేనే షూట్‌ చేశా:క్రిష్‌

'మణికర్ణిక'.. ఝాన్సీలక్ష్మిబాయి జీవితాన్ని ఆధారంగా చేసుకుని కంగనా రనౌత్‌ కథానాయికగా బాలీవుడ్‌లో తెరకెక్కింది. సినీ ప్రియుల్లో ఈ సినిమాకు సంబంధించి ఎన్నో అనుమానాలున్నాయి. వీటిపై తాజాగా దర్శకుడు క్రిష్‌ స్పందించారు. సమంత అక్కినేని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఓ షోలో.. ఆయన పాల్గొని తన కెరీర్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను వెల్లడించారు. సోనూసూద్​ పోషించిన సదాశివ్​ పాత్రను ఫస్ట్​ హాఫ్​లో ముగించమని కంగనా టీమ్​ చెప్పడం వల్ల వివాదానికి దారితీసిందని తెలిపారు.

"గతేడాది 'మణికర్ణిక' విడుదలయ్యింది. ఇప్పటివరకూ 'మణికర్ణిక' గురించి నేను పూర్తిగా మాట్లాడలేదు. కేవలం ఒకే ఒక్కసారి మాత్రం ఓ ఇంటర్వ్యూలో చెప్పాను. ఆ తర్వాత సోషల్‌మీడియాలో ఎన్నో వార్తలు వచ్చాయి. కంగన కూడా ఓ ట్వీట్‌ పెట్టారు. ఇప్పుడు నేను కూర్చున్న ఈ స్థానంలోనే 'మణికర్ణిక' మూవీ పూజా కార్యక్రమం అప్పట్లో నిర్వహించాం. దాదాపు 25 రోజులపాటు ఇక్కడే షూటింగ్‌ చేశాం. నిజం చెప్పాలంటే, 91 రోజుల్లో మేమంతా ఎంతో సంతోషంగా 'మణికర్ణిక' షూట్‌ పూర్తి చేశాం. కంగనకు, నాకూ మధ్య ఎలాంటి సమస్యలు రాలేదు. షూట్‌ అంతా ఎంతో సంతోషంగా గడిచింది. రీరికార్డింగ్‌ జరుగుతున్న సమయంలో కంగన టీమ్‌ సినిమా చూశారు. ఫస్ట్‌ హాఫ్‌ వాళ్లకి బాగా నచ్చింది. అలాగే సెకండ్ హాఫ్‌ కూడా బాగుందని చెప్పారు.

కొన్నిరోజులు గడిచిన తర్వాత కంగన టీమ్‌ నుంచి నాకు ఫోన్‌ వచ్చింది. కొన్ని సన్నివేశాలు నచ్చలేదని, కొన్నిచోట్ల బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బాలేదని చెప్పారు. నేను షూట్‌ చేసిన దాని ప్రకారం సోనూసూద్‌ పోషించిన 'సదాశివ్‌' పాత్ర సెకండ్‌ హాఫ్‌లో చివరి 20 నిమిషాల వరకూ ఉంటుంది. కానీ అది వాళ్లకు నచ్చలేదు. సదాశివ్ పాత్రను ఫస్ట్‌హాఫ్‌తోనే ముగించమని చెప్పారు. అది నా వల్ల కాదని ఎందుకంటే 'మణికర్ణిక' ఒక చారిత్రాత్మక చిత్రమని చెప్పాను.

అనంతరం కంగన టీమ్‌ సోనూసూద్‌ని కలిసి సినిమాలో తన పాత్రను తగ్గిస్తున్నట్లు, రీషూట్‌ చేస్తున్నట్లు చెప్పారు. ఆయన దానికి అంగీకరించలేదు. నాకు ఫోన్‌ చేసి.. 'నిజంగానే నా పాత్రను రీషూట్‌ చేస్తున్నారా?నీకు ఓకే అయితే నాకు ఎలాంటి ఇబ్బందిలేదు’ అని చెప్పారు. అలా ఏం లేదు అని, నేను రీషూట్‌ చేయడం లేదని సమాధానమిచ్చాను. ఇదే విషయాన్ని సోనూ.. కంగనకు ఫోన్‌ చేసి చెప్పారు. దానికి ఆమె.. 'క్రిష్‌ రీషూట్‌ చేయకపోతే నేను చిత్రీకరిస్తాను' అని సమాధానమివ్వడం వల్ల ఈ వివాదం ప్రారంభమైంది."

-- క్రిష్​, దర్శకుడు

అనంతరం 'మణికర్ణిక'ను కంగనా టీమ్​ రీషూట్‌ చేసుకున్నారని చెప్పారు క్రిష్​. కానీ, 'నా బాధ ఏమిటంటే.. నేను అనుకున్న, తెరకెక్కించిన కథను ప్రజలకు చూపించలేకపోయాను. 'మణికర్ణిక'ను నేను 100 శాతం షూట్‌ చేశా. కానీ అందులో వాళ్లు ఎన్నో మార్పులు చేసి ఇప్పుడు మీరు చూస్తున్న చిత్రాన్ని మీకు అందించారు' అని ఆయన‌ తెలిపారు.

ఇదీ చూడండి:'సినిమాబాద్​'.. భాగ్యనగరంలో షూటింగ్‌ల జోరు

'మణికర్ణిక'.. ఝాన్సీలక్ష్మిబాయి జీవితాన్ని ఆధారంగా చేసుకుని కంగనా రనౌత్‌ కథానాయికగా బాలీవుడ్‌లో తెరకెక్కింది. సినీ ప్రియుల్లో ఈ సినిమాకు సంబంధించి ఎన్నో అనుమానాలున్నాయి. వీటిపై తాజాగా దర్శకుడు క్రిష్‌ స్పందించారు. సమంత అక్కినేని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఓ షోలో.. ఆయన పాల్గొని తన కెరీర్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను వెల్లడించారు. సోనూసూద్​ పోషించిన సదాశివ్​ పాత్రను ఫస్ట్​ హాఫ్​లో ముగించమని కంగనా టీమ్​ చెప్పడం వల్ల వివాదానికి దారితీసిందని తెలిపారు.

"గతేడాది 'మణికర్ణిక' విడుదలయ్యింది. ఇప్పటివరకూ 'మణికర్ణిక' గురించి నేను పూర్తిగా మాట్లాడలేదు. కేవలం ఒకే ఒక్కసారి మాత్రం ఓ ఇంటర్వ్యూలో చెప్పాను. ఆ తర్వాత సోషల్‌మీడియాలో ఎన్నో వార్తలు వచ్చాయి. కంగన కూడా ఓ ట్వీట్‌ పెట్టారు. ఇప్పుడు నేను కూర్చున్న ఈ స్థానంలోనే 'మణికర్ణిక' మూవీ పూజా కార్యక్రమం అప్పట్లో నిర్వహించాం. దాదాపు 25 రోజులపాటు ఇక్కడే షూటింగ్‌ చేశాం. నిజం చెప్పాలంటే, 91 రోజుల్లో మేమంతా ఎంతో సంతోషంగా 'మణికర్ణిక' షూట్‌ పూర్తి చేశాం. కంగనకు, నాకూ మధ్య ఎలాంటి సమస్యలు రాలేదు. షూట్‌ అంతా ఎంతో సంతోషంగా గడిచింది. రీరికార్డింగ్‌ జరుగుతున్న సమయంలో కంగన టీమ్‌ సినిమా చూశారు. ఫస్ట్‌ హాఫ్‌ వాళ్లకి బాగా నచ్చింది. అలాగే సెకండ్ హాఫ్‌ కూడా బాగుందని చెప్పారు.

కొన్నిరోజులు గడిచిన తర్వాత కంగన టీమ్‌ నుంచి నాకు ఫోన్‌ వచ్చింది. కొన్ని సన్నివేశాలు నచ్చలేదని, కొన్నిచోట్ల బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బాలేదని చెప్పారు. నేను షూట్‌ చేసిన దాని ప్రకారం సోనూసూద్‌ పోషించిన 'సదాశివ్‌' పాత్ర సెకండ్‌ హాఫ్‌లో చివరి 20 నిమిషాల వరకూ ఉంటుంది. కానీ అది వాళ్లకు నచ్చలేదు. సదాశివ్ పాత్రను ఫస్ట్‌హాఫ్‌తోనే ముగించమని చెప్పారు. అది నా వల్ల కాదని ఎందుకంటే 'మణికర్ణిక' ఒక చారిత్రాత్మక చిత్రమని చెప్పాను.

అనంతరం కంగన టీమ్‌ సోనూసూద్‌ని కలిసి సినిమాలో తన పాత్రను తగ్గిస్తున్నట్లు, రీషూట్‌ చేస్తున్నట్లు చెప్పారు. ఆయన దానికి అంగీకరించలేదు. నాకు ఫోన్‌ చేసి.. 'నిజంగానే నా పాత్రను రీషూట్‌ చేస్తున్నారా?నీకు ఓకే అయితే నాకు ఎలాంటి ఇబ్బందిలేదు’ అని చెప్పారు. అలా ఏం లేదు అని, నేను రీషూట్‌ చేయడం లేదని సమాధానమిచ్చాను. ఇదే విషయాన్ని సోనూ.. కంగనకు ఫోన్‌ చేసి చెప్పారు. దానికి ఆమె.. 'క్రిష్‌ రీషూట్‌ చేయకపోతే నేను చిత్రీకరిస్తాను' అని సమాధానమివ్వడం వల్ల ఈ వివాదం ప్రారంభమైంది."

-- క్రిష్​, దర్శకుడు

అనంతరం 'మణికర్ణిక'ను కంగనా టీమ్​ రీషూట్‌ చేసుకున్నారని చెప్పారు క్రిష్​. కానీ, 'నా బాధ ఏమిటంటే.. నేను అనుకున్న, తెరకెక్కించిన కథను ప్రజలకు చూపించలేకపోయాను. 'మణికర్ణిక'ను నేను 100 శాతం షూట్‌ చేశా. కానీ అందులో వాళ్లు ఎన్నో మార్పులు చేసి ఇప్పుడు మీరు చూస్తున్న చిత్రాన్ని మీకు అందించారు' అని ఆయన‌ తెలిపారు.

ఇదీ చూడండి:'సినిమాబాద్​'.. భాగ్యనగరంలో షూటింగ్‌ల జోరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.