లెజండరీ యాక్టర్ దిలీప్ కుమార్ ఆదివారం ఆస్పత్రిలో చేరారు. సాధారణ ఆరోగ్య పరీక్షల కోసమే ఆస్పత్రిలో చేరినట్లు ఆయన సతీమణి నటి సైరా భాను తెలిపారు. ఆ పరీక్షల అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ దిలీప్ డిశ్చార్జ్ అవుతారని ఆమె వెల్లడించారు. దిలీప్ క్షేమంగా ఉండాలని ప్రతిఒక్కరూ ప్రార్థన చేయాలని అభిమానులకు కోరారు.
గతేడాది దిలీప్ సోదరలైన అస్లాం ఖాన్(88), ఇహాన్ ఖాన్(90) కరోనా బారిన పడి మరణించారు. దిలీప్ కుమార్.. 1944లో విడుదలైన 'జ్వర్ భాతా' బాలీవుడ్లో అడుగుపెట్టారు. ఆ తర్వాత ఐదు దశాబ్దాల పాటు నటుడిగా రాణించారు. చివరిసారిగా 'కిలా' చిత్రంలో దిలీప్ నటించారు.
ఇదీ చూడండి: 'లాల్సింగ్ చద్దా' కోసం లద్దాఖ్కు నాగచైతన్య!