'దండుపాళ్యం' మూడు భాగాలు తీసిన దర్శకుడు శ్రీనివాసరాజు.. కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. '18+సినిమా' పేరుతో తీస్తున్నట్లు చెప్పాడు. సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్నాడు. సలోని మిశ్రా హీరోయిన్.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన చివరి షెడ్యూల్ జరుగుతోంది. తమిళనాడులో ఈనెల 20 వరకు చిత్రీకరణ సాగుతుంది. మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.