ETV Bharat / sitara

ఆ విషయం నన్ను కలచి వేసింది: అమిర్​ఖాన్​

author img

By

Published : Feb 22, 2020, 7:45 PM IST

Updated : Mar 2, 2020, 5:17 AM IST

కొన్ని ముందస్తు జాగ్రత్తలతో కోవిడ్​-19ను సమర్ధంగా ఎదుర్కోగలమని అన్నాడు బాలీవుడ్​ నటుడు అమిర్​ఖాన్. ఈ వైరస్ బారిన పడి మరణించిన వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశాడు.

Coronavirus: Aamir Khan urges Chinese fans to take precautions, follow instructions of govt
ఆ విషయం నన్ను కలచి వేసింది: అమిర్​ఖాన్​

చైనాలో కరోనా(కోవిడ్​-19) ప్రభావం తీవ్రంగా ఉంది. అక్కడి ప్రజలు ఈ వైరస్​ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ, మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే ఈ విషయంపై కొందరు ప్రముఖులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్​ హీరో అమిర్​ఖాన్ బాధితులకు ఓదార్పుగా నిలిచాడు. అందుకోసం సోషల్ మీడియాలో ఓ వీడియా సందేశాన్ని పంచుకున్నాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

"చైనాలో కరోనా సంక్షోభం నన్నెంతో కలచివేసింది. ఈ వైరస్​ బారిన పడి చాలా మంది మరణించడం, నన్ను మరింత ఆందోళనకు గురిచేసింది. వారికి నా ప్రగాఢ సానుభూతి. ఈ వైరస్​ను అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణమే తగు చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాను. మిగిలినవారు దీని బారిన పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోండి"

- అమిర్​ఖాన్​, బాలీవుడ్​ హీరో

చైనా అధికారులు శనివారం ప్రకటించిన వివరాల ప్రకారం.. కోవిడ్​-19 వల్ల ఇప్పటివరకు 2,345 మంది మరణించారు. సుమారు 76 వేల మందికి పైగా ఈ వ్యాధి సోకినట్లు నిర్ధారించారు.

ఇదీ చూడండి.. 'చిరంజీవిని కొడుతుంటే నేను ఏడ్చేవాడ్ని'

చైనాలో కరోనా(కోవిడ్​-19) ప్రభావం తీవ్రంగా ఉంది. అక్కడి ప్రజలు ఈ వైరస్​ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ, మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే ఈ విషయంపై కొందరు ప్రముఖులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్​ హీరో అమిర్​ఖాన్ బాధితులకు ఓదార్పుగా నిలిచాడు. అందుకోసం సోషల్ మీడియాలో ఓ వీడియా సందేశాన్ని పంచుకున్నాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

"చైనాలో కరోనా సంక్షోభం నన్నెంతో కలచివేసింది. ఈ వైరస్​ బారిన పడి చాలా మంది మరణించడం, నన్ను మరింత ఆందోళనకు గురిచేసింది. వారికి నా ప్రగాఢ సానుభూతి. ఈ వైరస్​ను అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణమే తగు చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాను. మిగిలినవారు దీని బారిన పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోండి"

- అమిర్​ఖాన్​, బాలీవుడ్​ హీరో

చైనా అధికారులు శనివారం ప్రకటించిన వివరాల ప్రకారం.. కోవిడ్​-19 వల్ల ఇప్పటివరకు 2,345 మంది మరణించారు. సుమారు 76 వేల మందికి పైగా ఈ వ్యాధి సోకినట్లు నిర్ధారించారు.

ఇదీ చూడండి.. 'చిరంజీవిని కొడుతుంటే నేను ఏడ్చేవాడ్ని'

Last Updated : Mar 2, 2020, 5:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.