ETV Bharat / sitara

నెటిజన్లపై హీరోయిన్​ జాన్వీ కపూర్​ ఆగ్రహం

author img

By

Published : May 5, 2021, 7:16 AM IST

'అతిలోకసుందరి' కుమార్తె జాన్వీ కపూర్​.. ఇటీవలే ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్​ చేసిన ఓ ఫొటో నెట్టింట ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దేశంలో కరోనా వ్యాప్తితో ప్రజలు ఇబ్బంది పడుతున్న వేళ అందాల ఆరబోత స్టిల్స్​ అవసరమా? అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేశారు. వీటిపై జాన్వీ స్పందించి.. ధీటుగా జవాబిచ్చింది.

Cautious Janhvi Kapoor safeguards herself against trolls as she shares latest cover shoot
నెటిజన్లపై హీరోయిన్​ జాన్వీ కపూర్​ ఆగ్రహం

బాలీవుడ్​ హీరోయిన్​ జాన్వీకపూర్​.. తన ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్​ చేసిన ఓ ఫొటోపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. దేశమంతా కరోనా వ్యాప్తితో బాధపడుతుంటే.. తీరికగా ఆమె అందాలు ఆరబోస్తున్న ఫొటోలను షేర్​ చేయడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే సోషల్​మీడియాలో తనపై వస్తోన్న ట్రోల్స్​పై జాన్వీ స్పందించింది.

Cautious Janhvi Kapoor safeguards herself against trolls as she shares latest cover shoot
ఇన్​స్టాగ్రామ్​లో జాన్వీ కపూర్​ పోస్ట్​ చేసిన ఫొటో

ఆ ఫొటో లాక్​డౌన్​కు ముందు ఓ మ్యాగ్​జైన్​ కవర్​పేజీ కోసం చేసిన ఫొటోషూట్​కు సంబంధించినదని చెప్పింది. నిజనిజాలు తెలుసుకోకుండా అలా ఎలా మాట్లాడుతారని నెటిజన్లపై ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తనకూ సామాజిక బాధ్యత గురించి తెలుసని వెల్లడించింది. ఆ తర్వాత వివాదంగా మారిన ఫొటోను ఇన్​స్టాగ్రామ్​ నుంచి జాన్వీ తొలగించింది. కరోనా మహమ్మారి నుంచి దేశం త్వరగా కోలుకోలని ప్రార్థిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం జాన్వీ.. 'గుడ్​లక్​ జెర్రీ' సినిమాతో మరో రెండు చిత్రాల్లో నటిస్తోంది.

ఇదీ చూడండి: సవాల్​ పాత్రలకు సొగసరి సిద్ధం!

బాలీవుడ్​ హీరోయిన్​ జాన్వీకపూర్​.. తన ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్​ చేసిన ఓ ఫొటోపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. దేశమంతా కరోనా వ్యాప్తితో బాధపడుతుంటే.. తీరికగా ఆమె అందాలు ఆరబోస్తున్న ఫొటోలను షేర్​ చేయడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే సోషల్​మీడియాలో తనపై వస్తోన్న ట్రోల్స్​పై జాన్వీ స్పందించింది.

Cautious Janhvi Kapoor safeguards herself against trolls as she shares latest cover shoot
ఇన్​స్టాగ్రామ్​లో జాన్వీ కపూర్​ పోస్ట్​ చేసిన ఫొటో

ఆ ఫొటో లాక్​డౌన్​కు ముందు ఓ మ్యాగ్​జైన్​ కవర్​పేజీ కోసం చేసిన ఫొటోషూట్​కు సంబంధించినదని చెప్పింది. నిజనిజాలు తెలుసుకోకుండా అలా ఎలా మాట్లాడుతారని నెటిజన్లపై ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తనకూ సామాజిక బాధ్యత గురించి తెలుసని వెల్లడించింది. ఆ తర్వాత వివాదంగా మారిన ఫొటోను ఇన్​స్టాగ్రామ్​ నుంచి జాన్వీ తొలగించింది. కరోనా మహమ్మారి నుంచి దేశం త్వరగా కోలుకోలని ప్రార్థిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం జాన్వీ.. 'గుడ్​లక్​ జెర్రీ' సినిమాతో మరో రెండు చిత్రాల్లో నటిస్తోంది.

ఇదీ చూడండి: సవాల్​ పాత్రలకు సొగసరి సిద్ధం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.