బాలీవుడ్ హీరోయిన్ జాన్వీకపూర్.. తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఓ ఫొటోపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. దేశమంతా కరోనా వ్యాప్తితో బాధపడుతుంటే.. తీరికగా ఆమె అందాలు ఆరబోస్తున్న ఫొటోలను షేర్ చేయడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే సోషల్మీడియాలో తనపై వస్తోన్న ట్రోల్స్పై జాన్వీ స్పందించింది.
![Cautious Janhvi Kapoor safeguards herself against trolls as she shares latest cover shoot](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11644812_1.jpg)
ఆ ఫొటో లాక్డౌన్కు ముందు ఓ మ్యాగ్జైన్ కవర్పేజీ కోసం చేసిన ఫొటోషూట్కు సంబంధించినదని చెప్పింది. నిజనిజాలు తెలుసుకోకుండా అలా ఎలా మాట్లాడుతారని నెటిజన్లపై ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తనకూ సామాజిక బాధ్యత గురించి తెలుసని వెల్లడించింది. ఆ తర్వాత వివాదంగా మారిన ఫొటోను ఇన్స్టాగ్రామ్ నుంచి జాన్వీ తొలగించింది. కరోనా మహమ్మారి నుంచి దేశం త్వరగా కోలుకోలని ప్రార్థిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం జాన్వీ.. 'గుడ్లక్ జెర్రీ' సినిమాతో మరో రెండు చిత్రాల్లో నటిస్తోంది.
ఇదీ చూడండి: సవాల్ పాత్రలకు సొగసరి సిద్ధం!