బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖత్తర్ 'సైరత్' అనే మరాఠి చిత్రాన్ని 'ధఢక్'గా రీమేక్ చేసి మెప్పించాడు. తన తదుపరి చిత్రం తెలుగులో విజయ్ దేవరకొండ చేసిన 'గీతా గోవిందం'లో కథానాయకుడుగా చేసేందుకు ఆసక్తి చూపాడు. కానీ ఇ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు.
ఇదిలా ఉండగా.. ఇషాన్ ప్రస్తుతం ‘'కాలీ పీలి'’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. 'మక్బూల్ ఖాన్' దర్శకుడు. అనన్య పాండే కథానాయిక. ఈ చిత్రం తెలుగులో వచ్చిన 'టాక్సీవాలా'కు రీమేక్గా రూపొందుతుంది. జీ స్టూడియోస్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం 2020 జూన్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదీ చూడండి : 'వెన్నెల'కు పాత రోజులు గుర్తొచ్చాయంటా..!