ETV Bharat / sitara

నా మనసును తాకిన 'బుట్టబొమ్మ' ఇదే: అల్లు అర్జున్

author img

By

Published : Feb 11, 2020, 7:40 AM IST

Updated : Feb 29, 2020, 10:45 PM IST

'బుట్టబొమ్మ' టిక్ టాక్ వీడియోల్లో తన మనసును తాకిందీ ఇదేనంటూ ఓ వీడియోను పోస్ట్​ చేశాడు హీరో అల్లు అర్జున్. ఇది చూసి ఎంతో సంతోషించానని అన్నాడు.

నా మనసును తాకిన 'బుట్టబొమ్మ' ఇదే: అల్లు అర్జున్
హీరో అల్లు అర్జున్

'బుట్టబొమ్మా.. బుట్ట బొమ్మా'.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పాట.. ఎవరిని కదిపినా ఇదే హమ్‌. భాషలతో సంబంధం లేకుండా రాష్ట్రాలు దాటిపోయిందీ తెలుగు పాట. టిక్‌టాక్‌ ఓపెన్‌ చేయడమే ఆలస్యం.. దక్షిణాదితో పాటు ఉత్తరాది యువత ఈ పాటకు నృత్యాలు చేస్తూ వీడియోలు చేస్తున్నారు. తెలుగు రాకపోయినా మాజీ ప్రపంచ సుందరి శిల్పాశెట్టి సైతం ఈ పాటకు బుట్టబొమ్మాలా మారి స్టెప్పులు వేసింది. ఆ వీడియో బాగా వైరల్‌ అయింది.

తాజాగా మరో ఇద్దరు వ్యక్తులు వేర్వేరుగా ఈ పాటకు డ్యాన్స్‌ చేశారు. అయితే వారిద్దరూ దివ్యాంగులు కావడం ఇక్కడ విశేషం. కాళ్లు లేని ఓ యువకుడు ఈ పాటకు డ్యాన్స్‌ చేసి వీడియో టిక్‌టాక్‌లో పోస్టు చేయగా.. దానికి డ్యుయెట్‌ చేసిందో చేతుల్లేని యువతి. ఈ వీడియో కాస్త తిరిగి తిరిగి హీరో అల్లు అర్జున్‌ వరకూ చేరింది. వీడియో చూసిన బన్నీ.. బాగా భావోద్వేగానికి గురయ్యాడు. దానిని తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేసి అభిమానులతో పంచుకున్నాడు.

This was the most heart touching one of all the #ButtaBomma Video’s . I felt so happy to see that music takes us farrr beyond our limits. #Inspiring pic.twitter.com/67tawEvkPP

— Allu Arjun (@alluarjun) February 10, 2020 ">

'బుట్టబొమ్మ వీడియోల్లో గుండెను నా తాకిందిదే. సంగీతం మన వైకల్యాన్నీ మరిపిస్తుంది. ఈ వీడియో చూసి ఎంతో సంతోషించాను' అని రాసుకొచ్చాడు బన్నీ. సంగీత దర్శకుడు తమన్‌.. ఈ వీడియోను షేర్‌ చేశాడు.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా నటించిన సినిమా 'అల వైకుంఠపురములో'. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి, బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్లు వసూలు చేస్తూనే ఉంది. పూజా హెగ్డే హీరోయిన్‌. సంగీతమందించిన తమన్‌కు ఇది తన కెరీర్‌లోనే ఒక మైలురాయిగా మారింది. అల్లు అరవింద్‌, రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించారు.

'బుట్టబొమ్మా.. బుట్ట బొమ్మా'.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పాట.. ఎవరిని కదిపినా ఇదే హమ్‌. భాషలతో సంబంధం లేకుండా రాష్ట్రాలు దాటిపోయిందీ తెలుగు పాట. టిక్‌టాక్‌ ఓపెన్‌ చేయడమే ఆలస్యం.. దక్షిణాదితో పాటు ఉత్తరాది యువత ఈ పాటకు నృత్యాలు చేస్తూ వీడియోలు చేస్తున్నారు. తెలుగు రాకపోయినా మాజీ ప్రపంచ సుందరి శిల్పాశెట్టి సైతం ఈ పాటకు బుట్టబొమ్మాలా మారి స్టెప్పులు వేసింది. ఆ వీడియో బాగా వైరల్‌ అయింది.

తాజాగా మరో ఇద్దరు వ్యక్తులు వేర్వేరుగా ఈ పాటకు డ్యాన్స్‌ చేశారు. అయితే వారిద్దరూ దివ్యాంగులు కావడం ఇక్కడ విశేషం. కాళ్లు లేని ఓ యువకుడు ఈ పాటకు డ్యాన్స్‌ చేసి వీడియో టిక్‌టాక్‌లో పోస్టు చేయగా.. దానికి డ్యుయెట్‌ చేసిందో చేతుల్లేని యువతి. ఈ వీడియో కాస్త తిరిగి తిరిగి హీరో అల్లు అర్జున్‌ వరకూ చేరింది. వీడియో చూసిన బన్నీ.. బాగా భావోద్వేగానికి గురయ్యాడు. దానిని తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేసి అభిమానులతో పంచుకున్నాడు.

'బుట్టబొమ్మ వీడియోల్లో గుండెను నా తాకిందిదే. సంగీతం మన వైకల్యాన్నీ మరిపిస్తుంది. ఈ వీడియో చూసి ఎంతో సంతోషించాను' అని రాసుకొచ్చాడు బన్నీ. సంగీత దర్శకుడు తమన్‌.. ఈ వీడియోను షేర్‌ చేశాడు.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా నటించిన సినిమా 'అల వైకుంఠపురములో'. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి, బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్లు వసూలు చేస్తూనే ఉంది. పూజా హెగ్డే హీరోయిన్‌. సంగీతమందించిన తమన్‌కు ఇది తన కెరీర్‌లోనే ఒక మైలురాయిగా మారింది. అల్లు అరవింద్‌, రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించారు.

ZCZC
PRI GEN NAT
.NEWDELHI DEL58
CBI-NOIDA
CBI arrests former Noida engineer Yadav Singh in corruption case
         New Delhi, Feb 10 (PTI) The CBI has arrested former New Okhla Industrial Development Authority (Noida) chief engineer Yadav Singh on Monday in a two-year old corruption case for allegedly awarding projects worth Rs 116.39 crore to private companies during his tenure, in return of regular bribes from them, officials said.
         The case has been registered on the allegations of criminal conspiracy and misuse of official position as well as accepting bribe regularly by Singh from the accused contractors and firms while awarding contracts.
         "It was also alleged that the then chief maintenance engineer (CME) in conspiracy with other officers/officials of the NOIDA as well as with the said contractors had awarded several contracts worth Rs 116.39 crore (approx.) to the five firms in gross violation of tender norms and procedures of the Noida," the CBI said. PTI ABS
NSD
02101945
NNNN
Last Updated : Feb 29, 2020, 10:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.