ETV Bharat / sitara

మాస్క్​.. కెమెరా.. యాక్షన్​: లండన్​లో 'బెల్​బాటమ్​'​ షూటింగ్​​

author img

By

Published : Aug 21, 2020, 6:00 AM IST

కరోనాతో నిలిచిపోయిన బాలీవుడ్​ స్టార్​ అక్షయ్​కుమార్​ చిత్రం 'బెల్​బాటమ్' షూటింగ్​ లండన్​లో పునఃప్రారంభమైంది. లాక్​డౌన్​ తర్వాత సెట్​లో అడుగుపెట్టడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు అక్షయ్​.

Akshay kumar
అక్షయ్​

బాలీవుడ్​ స్టార్​ అక్షయ్​కుమార్​ నటిస్తోన్న చిత్రం 'బెల్​బాటమ్' చిత్రీకరణ.. లండన్​లో పునఃప్రారంభమైంది. లాక్​డౌన్​ తర్వాత మళ్లీ సెట్​లో అడుగుపెట్టడం ఎంతో ఆనందంగా ఉందని అక్షయ్, హీరోయిన్​ లారా దత్త ​ తెలిపారు. అన్ని రకాల కరోనా జాగ్రత్త చర్యలు పాటిస్తున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించి మాస్క్​లు ధరించిన ఫొటోను ఇన్​స్టాలో పోస్ట్​ చేశారు దత్త. వీరితో పాటు హ్యూమా ఖురేషి, ఆదిల్​ హుస్సెన్​లు షూటింగ్​లో పాల్గొన్నారు.

దీంతో పాటు చిత్రీకరణ సమయంలో వైద్యులను కూడా అందుబాటులో ఉంచుకున్నట్లు ఇటీవలే తెలిపారు అక్షయ్​.

కన్నడ 'బెల్​బాటమ్'కు రీమేక్​

గతేడాది వచ్చిన కన్నడ 'బెల్​బాటమ్'కు రీమేక్​ ఈ సినిమా. మాతృకలో రిషబ్​ శెట్టి, హరిప్రియ ప్రధాన పాత్రలు పోషించారు. 1980లో జరిగిన నిజజీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఇందులో కథానాయకుడు అక్షయ్​ డిటెక్టివ్​గా కనిపించనున్నారు. ఈ చిత్రానికి రంజిత్​ తివారీ దర్శకత్వం వహిస్తున్నాడు. తొలిసారిగా అక్షయ్​-వాణీ కపూర్​ కలిసి కనువిందు చేయనున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 2న విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది.

ఇది చూడండి ఎస్పీ బాలు కోలుకోవాలని సామూహిక ప్రార్థనలు

బాలీవుడ్​ స్టార్​ అక్షయ్​కుమార్​ నటిస్తోన్న చిత్రం 'బెల్​బాటమ్' చిత్రీకరణ.. లండన్​లో పునఃప్రారంభమైంది. లాక్​డౌన్​ తర్వాత మళ్లీ సెట్​లో అడుగుపెట్టడం ఎంతో ఆనందంగా ఉందని అక్షయ్, హీరోయిన్​ లారా దత్త ​ తెలిపారు. అన్ని రకాల కరోనా జాగ్రత్త చర్యలు పాటిస్తున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించి మాస్క్​లు ధరించిన ఫొటోను ఇన్​స్టాలో పోస్ట్​ చేశారు దత్త. వీరితో పాటు హ్యూమా ఖురేషి, ఆదిల్​ హుస్సెన్​లు షూటింగ్​లో పాల్గొన్నారు.

దీంతో పాటు చిత్రీకరణ సమయంలో వైద్యులను కూడా అందుబాటులో ఉంచుకున్నట్లు ఇటీవలే తెలిపారు అక్షయ్​.

కన్నడ 'బెల్​బాటమ్'కు రీమేక్​

గతేడాది వచ్చిన కన్నడ 'బెల్​బాటమ్'కు రీమేక్​ ఈ సినిమా. మాతృకలో రిషబ్​ శెట్టి, హరిప్రియ ప్రధాన పాత్రలు పోషించారు. 1980లో జరిగిన నిజజీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఇందులో కథానాయకుడు అక్షయ్​ డిటెక్టివ్​గా కనిపించనున్నారు. ఈ చిత్రానికి రంజిత్​ తివారీ దర్శకత్వం వహిస్తున్నాడు. తొలిసారిగా అక్షయ్​-వాణీ కపూర్​ కలిసి కనువిందు చేయనున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 2న విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది.

ఇది చూడండి ఎస్పీ బాలు కోలుకోవాలని సామూహిక ప్రార్థనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.