ETV Bharat / sitara

వ్యాపారవేత్తను పెళ్లాడిన 'పరుగు' హీరోయిన్​

author img

By

Published : Mar 14, 2020, 6:37 PM IST

Updated : Mar 14, 2020, 7:21 PM IST

టాలీవుడ్​ హీరోయిన్​ షీలా.. చెన్నైకి చెందిన ఓ వ్యాపారవేత్తను వివాహమాడింది. ఈ మేరకు భర్తతో దిగిన ఓ ఫొటోను ఫేస్​బుక్​లో పోస్ట్​ చేసింది. ఈ అమ్మడు అల్లుఅర్జున్​ సరసన 'పరుగు' సినిమాలో నటించింది.

Actress shella kaur ties the knot with an bussiness man of chennai
వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న 'పరుగు' హీరోయిన్​

స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కిన 'పరుగు' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి షీలా. కొంతకాలం నుంచి సినిమాలకు దూరంగా ఉన్న షీలా.. బుధవారం(మార్చి 11న) పెళ్లిపీటలెక్కింది. చెన్నైకి చెందిన ఓ వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. కుటుంబసభ్యులు, బంధువుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఈ మేరకు భర్తతో దిగిన ఫొటోను ఫేస్‌బుక్‌ వేదికగా అభిమానులతో పంచుకుందీ అందాల భామ.

" పెళ్లిరోజు మాకెంతో ప్రత్యేకమైనది. పోల్చడానికి మించిన సమయం.. మా గుండె లోతుల్లోని సంతోషం.. మేమిద్దరం కలిసి నూతన జీవితం ఆరంభించే ఓ కొత్త రోజు"

- షీలా, కథానాయిక.

2006లో విడుదలైన 'సీతాకోకా చిలుక' సినిమాతో.. షీలా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత ఏడాది విడుదలైన 'రాజుభాయ్‌' సినిమాలో మంచు మనోజ్‌ సరసన నటించింది. కాకపోతే ఆ రెండు సినిమాలు షీలాకు ఆశించిన గుర్తింపు అందించలేకపోయాయి. అనంతరం 2008లో విడుదలైన 'పరుగు' సినిమాలో బన్నీ సరసన ఆడిపాడింది. ఈ సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. 'పరుగు' చిత్రం తర్వాత వరుసగా ఎన్టీఆర్‌, రామ్‌, బాలకృష్ణ చిత్రాల్లో షీలా నటించింది. 2011లో విడుదలైన 'పరమ వీర చక్ర' సినిమా తర్వాత షీలా తెలుగు తెరకు దూరంగా ఉంది.

Actress shella kaur ties the knot with an bussiness man of chennai
వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న హీరోయిన్​ షీలా

ఇదీ చూడండి : భార్యభర్తల్ని తల్లి కొడుకుల్ని చేసిన నెటిజన్

స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కిన 'పరుగు' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి షీలా. కొంతకాలం నుంచి సినిమాలకు దూరంగా ఉన్న షీలా.. బుధవారం(మార్చి 11న) పెళ్లిపీటలెక్కింది. చెన్నైకి చెందిన ఓ వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. కుటుంబసభ్యులు, బంధువుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఈ మేరకు భర్తతో దిగిన ఫొటోను ఫేస్‌బుక్‌ వేదికగా అభిమానులతో పంచుకుందీ అందాల భామ.

" పెళ్లిరోజు మాకెంతో ప్రత్యేకమైనది. పోల్చడానికి మించిన సమయం.. మా గుండె లోతుల్లోని సంతోషం.. మేమిద్దరం కలిసి నూతన జీవితం ఆరంభించే ఓ కొత్త రోజు"

- షీలా, కథానాయిక.

2006లో విడుదలైన 'సీతాకోకా చిలుక' సినిమాతో.. షీలా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత ఏడాది విడుదలైన 'రాజుభాయ్‌' సినిమాలో మంచు మనోజ్‌ సరసన నటించింది. కాకపోతే ఆ రెండు సినిమాలు షీలాకు ఆశించిన గుర్తింపు అందించలేకపోయాయి. అనంతరం 2008లో విడుదలైన 'పరుగు' సినిమాలో బన్నీ సరసన ఆడిపాడింది. ఈ సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. 'పరుగు' చిత్రం తర్వాత వరుసగా ఎన్టీఆర్‌, రామ్‌, బాలకృష్ణ చిత్రాల్లో షీలా నటించింది. 2011లో విడుదలైన 'పరమ వీర చక్ర' సినిమా తర్వాత షీలా తెలుగు తెరకు దూరంగా ఉంది.

Actress shella kaur ties the knot with an bussiness man of chennai
వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న హీరోయిన్​ షీలా

ఇదీ చూడండి : భార్యభర్తల్ని తల్లి కొడుకుల్ని చేసిన నెటిజన్

Last Updated : Mar 14, 2020, 7:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.