మలయాళ ప్రముఖ నటుడు, రాజ్యసభ ఎంపీ సురేశ్ గోపీ అనారోగ్యం పాలయ్యారు. న్యూమోనియా కారణంగా ఎర్నాకులంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు.
'పప్పన్' షూటింగ్లో ఉన్నప్పుడు ఆయనకు అసౌకర్యంగా అనిపించడం వల్ల తక్షణమే హాస్పిటల్కు తీసుకెళ్లారు. గత నాలుగు రోజుల నుంచి ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
కేరళలో ఏప్రిల్ 6న అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో భాజపా తరఫున ఆయనకు నెమమ్ లేదా త్రిసూర్ టికెట్ ఇవ్వాలని భావిస్తోంది. ఈ క్రమంలో గోపీ సురేశ్ ఆస్పత్రిలో చేరడం వల్ల ఎన్నికల్లో పోటీపై సందిగ్ధత నెలకొననుంది!