అభిషేక్ బచ్చన్, నిత్యామేనన్, సయామీ కేర్ వంటి తారాగణంతో తెరకెక్కిన వెబ్ సిరీస్ 'బ్రీత్: ఇన్టు ద షాడోస్'. మయాంక్ శర్మ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ను జులై 10న అమెజాన్ ప్రైమ్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. 2018లో విడుదలైన 'బ్రీత్' మొదటి భాగం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది.
సైకలాజికల్ థ్రిల్లర్గా తెరకెక్కిన 'బ్రీత్' మొదటి సీజన్లో హీరో మాధవన్ కీలకపాత్ర పోషించారు. రెండో భాగంలో అభిషేక్ కనిపించనున్నారు. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్గా పేరు తెచ్చుకున్న ఈ సిరీస్ రెండో భాగం కోసం ఇప్పటికే ప్రైమ్ ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.