టాలీవుడ్లో మరో బయోపిక్కు రంగం సిద్ధమైంది. ఒలింపిక్స్ మహిళా విభాగంలో భారత్కు తొలి పతకం అందించిన వెయిట్ లిఫ్టర్ కరణం మల్లేశ్వరి జీవితాన్ని త్వరలో రూపొందించనున్నారు. ఈ రోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా చిత్ర పోస్టర్ను విడుదల చేసి, అధికారిక ప్రకటన చేశారు.
ఈ సినిమాకు సంజనా రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. ఎమ్వీవీ సత్యనారాయణ, కోన వెంకట్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఇందులో మల్లేశ్వరి పాత్రలో ఎవరు కనిపించనున్నారు?, ఇతర సాంకేతిక సిబ్బంది వివరాలు తెలియాల్సి ఉంది. దీనిని పాన్ఇండియా చిత్రంగా పలు భాషల్లో తెరకెక్కించనున్నారు.
ఒలింపిక్స్లో భారత్ తరఫున రెండుసార్లు పాల్గొన్న మల్లేశ్వరి.. 1998 బ్యాంకాక్లో జరిగిన పోటీల్లో 63 కిలోల విభాగంలో రజతం, 2000లో సిడ్నీ పోటీల్లో కాంస్యం పతకం గెల్చుకున్నారు. 1995లో చైనా, గ్వాంగ్జూలో జరిగిన ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ టోర్నీలో 54 కిలోల విభాగంలో మూడు స్వర్ణాలు సాధించారు.
అనంతరం వెయిట్ లిఫ్టింగ్లో మల్లేశ్వరి చేసిన కృషికిగానూ భారత ప్రభుత్వం.. అర్జున అవార్డు, రాజీవ్ ఖేల్రత్న, పద్మశ్రీ పురస్కారాలతో ఆమెను సత్కరించింది.