ETV Bharat / sitara

కంగనా రనౌత్ 'లాక్​ అప్​' షోకు షాకిచ్చిన హైదరాబాద్ కోర్టు..

author img

By

Published : Feb 26, 2022, 8:33 PM IST

Stay Order on Lock Upp show: బాలీవుడ్​ నటి కంగనా రనౌత్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'లాక్ అప్' షో.. రేపు ఓటీటీలో విడుదల కానుంది. విడుదలకు కొన్ని గంటల సమయం మాత్రమే ఉండగా.. షో నిర్వాహకులకు హైదరాబాద్​ సిటీ సివిల్​ కోర్టు షాకిచ్చింది. లాక్​ అప్​ షోపై స్టే విధిస్తూ.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సనోబర్ బైగ్ వేసిన పిటిషన్​ను విచారించిన కోర్టు.. ఈ నిర్ణయం తీసుకుంది.

kangana ranaut lock upp show
కంగనా రనౌత్​ లాకప్​ షో

Stay Order on Lock Upp show: బాలీవుడ్​ నటి కంగనా రనౌత్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న "లాక్ అప్" షో ప్రసారంపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హిందీ నిర్మాత ఏక్తా కపూర్ సారథ్యంలో రూపొందించిన లాక్ అప్‌ షో ప్రసారం నిలిపివేయాలని కోరుతూ.. పిటిషనర్ సనోబర్ బేగ్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ సనోబర్ బేగ్ సమర్పించిన పత్రాలను పరిశీలించిన కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది.

తాను లాక్ అప్‌ షో ప్రోమో చూసినప్పుడు షాక్‌కి గురయ్యానని పిటిషనర్ బేగ్.. కోర్టుకు తెలియజేశారు. ఈ కాన్సెప్ట్ తనదని.. అందుకు సంబంధిత సంస్థ ప్రతినిధులతో చర్చించానని పేర్కొన్నారు. ఆ కాన్సెప్ట్‌తో ముందుకు వెళ్లవద్దని వారికి విజ్ఞప్తి చేసినట్లు కోర్టుకు వివరించారు. కానీ వారు పట్టించుకోకపోవడంతో పాటు.. షెడ్యూల్ ప్రకారం ప్రసారం చేయడానికి తమకు పూర్తి హక్కు ఉందని సవాలు చేశారని వెల్లడించారు. అందుకే తనకు న్యాయవ్యవస్థను ఆశ్రయించడం తప్ప మరో మార్గం లేదని పిటిషనర్ పేర్కొన్నారు. లాక్​ అప్​ షో ఈ నెల 27న ప్రసారం కావలసి ఉందని.. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ మీడియా, సామాజిక మధ్యమాల్లో ప్రదర్శించడాన్ని నిషేధించాలని పిటిషినర్​.. కోర్టుకు విన్నవించారు. బేగ్ విజ్ఞప్తి మేరకు ఆయన అందజేసిన డాక్యుమెంట్లను పరిశీలించి.. కోర్టు మధ్యంతర నోటీసులు జారీ చేసింది.

Kangana Lock Upp show: కంగనా రనౌత్ తొలిసారి హోస్ట్​గా మారి చేస్తున్న రియాలిటీ షో 'లాక్​ అప్'. దీని ట్రైలర్​ను ఈ నెల 16న రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 27 నుంచి ఏఎల్​టీ బాలాజీ, ఎమ్​ఎక్స్ ప్లేయర్​లో ఇది ఉచితంగా స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో ఈ షోపై కోర్టు స్టే విధించింది. మరి ఈ రియాలిటీ షో.. రేపు ప్రసారం అవుతుందో లేదో మరికొన్ని గంటల్లో తేలుతుంది.

ఇదీ చదవండి: 'యుద్ధం' ఎఫెక్ట్​.. అక్కడ లీటర్​ పెట్రోల్​ రూ.200 ప్లస్​

Stay Order on Lock Upp show: బాలీవుడ్​ నటి కంగనా రనౌత్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న "లాక్ అప్" షో ప్రసారంపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హిందీ నిర్మాత ఏక్తా కపూర్ సారథ్యంలో రూపొందించిన లాక్ అప్‌ షో ప్రసారం నిలిపివేయాలని కోరుతూ.. పిటిషనర్ సనోబర్ బేగ్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ సనోబర్ బేగ్ సమర్పించిన పత్రాలను పరిశీలించిన కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది.

తాను లాక్ అప్‌ షో ప్రోమో చూసినప్పుడు షాక్‌కి గురయ్యానని పిటిషనర్ బేగ్.. కోర్టుకు తెలియజేశారు. ఈ కాన్సెప్ట్ తనదని.. అందుకు సంబంధిత సంస్థ ప్రతినిధులతో చర్చించానని పేర్కొన్నారు. ఆ కాన్సెప్ట్‌తో ముందుకు వెళ్లవద్దని వారికి విజ్ఞప్తి చేసినట్లు కోర్టుకు వివరించారు. కానీ వారు పట్టించుకోకపోవడంతో పాటు.. షెడ్యూల్ ప్రకారం ప్రసారం చేయడానికి తమకు పూర్తి హక్కు ఉందని సవాలు చేశారని వెల్లడించారు. అందుకే తనకు న్యాయవ్యవస్థను ఆశ్రయించడం తప్ప మరో మార్గం లేదని పిటిషనర్ పేర్కొన్నారు. లాక్​ అప్​ షో ఈ నెల 27న ప్రసారం కావలసి ఉందని.. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ మీడియా, సామాజిక మధ్యమాల్లో ప్రదర్శించడాన్ని నిషేధించాలని పిటిషినర్​.. కోర్టుకు విన్నవించారు. బేగ్ విజ్ఞప్తి మేరకు ఆయన అందజేసిన డాక్యుమెంట్లను పరిశీలించి.. కోర్టు మధ్యంతర నోటీసులు జారీ చేసింది.

Kangana Lock Upp show: కంగనా రనౌత్ తొలిసారి హోస్ట్​గా మారి చేస్తున్న రియాలిటీ షో 'లాక్​ అప్'. దీని ట్రైలర్​ను ఈ నెల 16న రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 27 నుంచి ఏఎల్​టీ బాలాజీ, ఎమ్​ఎక్స్ ప్లేయర్​లో ఇది ఉచితంగా స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో ఈ షోపై కోర్టు స్టే విధించింది. మరి ఈ రియాలిటీ షో.. రేపు ప్రసారం అవుతుందో లేదో మరికొన్ని గంటల్లో తేలుతుంది.

ఇదీ చదవండి: 'యుద్ధం' ఎఫెక్ట్​.. అక్కడ లీటర్​ పెట్రోల్​ రూ.200 ప్లస్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.