ETV Bharat / science-and-technology

కొత్త రూల్స్​తో వాట్సాప్​కు మిగిలేది 18% యూజర్లే!

author img

By

Published : Jan 19, 2021, 11:42 AM IST

Updated : Feb 16, 2021, 7:53 PM IST

మెసెజింగ్ ప్లాట్​ఫామ్​లలో ఓ వెలుగు వెలిగిన వాట్సాప్.. ఇటీవల తీసుకొచ్చిన నిబంధనలతో చిక్కుల్లో పడింది. నూతన పాలసీలపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తూ.. ప్రత్యామ్నాయ యాప్​లపై దృష్టి సారిస్తున్నారు. ఈ కారణంగా భారత్​లో 18శాతం మంది యూజర్లు మాత్రమే వాట్సాప్​ను యథాతథంగా కొనసాగించాలనుకుంటున్నట్లు ఓ సర్వేలో తేలింది. అందులోని మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.

users on Whatsapp new rules
వాట్సాప్​ రూల్స్​పై యూజర్ల స్పందన

ఇటీవల తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో వాట్సాప్ యూజర్లలో గందరగోళం నెలకొంది. కొత్త పాలసీకి అంగీకారం తెలపడం ఇష్టంలేని చాలా మంది టెలిగ్రామ్​, సిగ్నల్ వంటి ప్రత్యామ్నాయ యాప్​లవైపు మొగ్గు చూపుతున్నారు.

యూజర్లలో మార్పు ఇలా..

ఓ సర్వే ప్రకారం భారత్​లో 18 శాతం మంది మాత్రమే వాట్సాప్​​ను యథాతథంగా కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలిసింది. 36శాతం మంది వాట్సాప్​ వినియోగాన్ని భారీగా తగ్గించాలనుకుంటున్నట్లు వెల్లడైంది. 15 శాతం మంది వాట్సాప్ పూర్తిగా వాడకూడదని నిర్ణయించుకున్నట్లు సర్వే వివరించింది.

పేమెంట్ సదుపాయం వాడేది లేదు..

మాషబుల్​ అనే సంస్థ చేసిన సర్వే ప్రకారం.. దేశవ్యాప్తంగా 24 శాతం మంది యూజర్లు (గ్రూప్​లతో కలిపి) వాట్సాప్​ను వీడి ఇతర యాప్​లను వాడాలనుకుంటున్నారు. 91 శాతం మంది వాట్సాప్​ పేమెంట్ సదుపాయాన్ని వినియోగించబోమని తేల్చి చెప్పారు. దేశంలోని 244 జిలాల్లో 24 వేల మంది ఈ సర్వేలో పాల్గొన్నారు.

పేమెంట్ సదుపాయాన్ని వినియోగిస్తే.. ఆ లావాదేవీల సమాచారాన్ని వాట్సాప్​ తమ మాతృసంస్థ ఫేస్​బుక్​ సహా ఇతర అనుబంధ కంపెనీలతో పంచుకుంటుందన్న అనుమానాలు ఇందుకు కారణంగా సర్వే పేర్కొంది.

గడువు పెంపు..

కొత్త నిబంధనలపై యూజర్లలో తలెత్తిన సందేహాలతో.. వాటికి ఆంగీకారం తెలిపేందుకు ఫిబ్రవరి 8తో ముగియాల్సిఉన్న తుది గడువును.. మార్చి 15కు పొడిగిచింది వాట్సాప్.

కొత్త నిబంధనల్లో యూజర్లు తమ లొకేషన్​, ఫోన్​ నంబర్​, ఇతర సమాచారాన్ని.. ఫేస్​బుక్​ సహా, తమ అనుబంధ సంస్థలతో పంచుకునేందుకు అనుమతివ్వాలనేది వాట్సాప్ నిబంధనల ముఖ్య ఉద్దేశం. అయితే బిజినెస్​ ఖాతాలకు మాత్రమే ఇవి వర్తిస్తాయని వాట్సాప్ పేర్కొంది.

వాటి డౌన్​లోడ్​లో వృద్ధి..

వాట్సాప్​ నిబంధనలతో.. జనవరి 1-5 మధ్య సిగ్నల్​, టెలిగ్రామ్​ డౌన్​లోడ్​లు వరుసగా 24 వేలు, 1.3 మిలియన్​లు పెరిగాయి. సిగ్నల్​ డౌన్​లోడ్​ల వృద్ధి 9,483 శాతంగా ఉండగా.. టెలిగ్రామ్ వృద్ధి 15 శాతంగా నమోదైంది. ఇదే సమయంలో వాట్సాప్​కు జనవరి 6-10 మధ్య డౌన్​లోడ్​లు 35 శాతం పడిపోయాయి.

ఇవీ చూడండి:

ఇటీవల తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో వాట్సాప్ యూజర్లలో గందరగోళం నెలకొంది. కొత్త పాలసీకి అంగీకారం తెలపడం ఇష్టంలేని చాలా మంది టెలిగ్రామ్​, సిగ్నల్ వంటి ప్రత్యామ్నాయ యాప్​లవైపు మొగ్గు చూపుతున్నారు.

యూజర్లలో మార్పు ఇలా..

ఓ సర్వే ప్రకారం భారత్​లో 18 శాతం మంది మాత్రమే వాట్సాప్​​ను యథాతథంగా కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలిసింది. 36శాతం మంది వాట్సాప్​ వినియోగాన్ని భారీగా తగ్గించాలనుకుంటున్నట్లు వెల్లడైంది. 15 శాతం మంది వాట్సాప్ పూర్తిగా వాడకూడదని నిర్ణయించుకున్నట్లు సర్వే వివరించింది.

పేమెంట్ సదుపాయం వాడేది లేదు..

మాషబుల్​ అనే సంస్థ చేసిన సర్వే ప్రకారం.. దేశవ్యాప్తంగా 24 శాతం మంది యూజర్లు (గ్రూప్​లతో కలిపి) వాట్సాప్​ను వీడి ఇతర యాప్​లను వాడాలనుకుంటున్నారు. 91 శాతం మంది వాట్సాప్​ పేమెంట్ సదుపాయాన్ని వినియోగించబోమని తేల్చి చెప్పారు. దేశంలోని 244 జిలాల్లో 24 వేల మంది ఈ సర్వేలో పాల్గొన్నారు.

పేమెంట్ సదుపాయాన్ని వినియోగిస్తే.. ఆ లావాదేవీల సమాచారాన్ని వాట్సాప్​ తమ మాతృసంస్థ ఫేస్​బుక్​ సహా ఇతర అనుబంధ కంపెనీలతో పంచుకుంటుందన్న అనుమానాలు ఇందుకు కారణంగా సర్వే పేర్కొంది.

గడువు పెంపు..

కొత్త నిబంధనలపై యూజర్లలో తలెత్తిన సందేహాలతో.. వాటికి ఆంగీకారం తెలిపేందుకు ఫిబ్రవరి 8తో ముగియాల్సిఉన్న తుది గడువును.. మార్చి 15కు పొడిగిచింది వాట్సాప్.

కొత్త నిబంధనల్లో యూజర్లు తమ లొకేషన్​, ఫోన్​ నంబర్​, ఇతర సమాచారాన్ని.. ఫేస్​బుక్​ సహా, తమ అనుబంధ సంస్థలతో పంచుకునేందుకు అనుమతివ్వాలనేది వాట్సాప్ నిబంధనల ముఖ్య ఉద్దేశం. అయితే బిజినెస్​ ఖాతాలకు మాత్రమే ఇవి వర్తిస్తాయని వాట్సాప్ పేర్కొంది.

వాటి డౌన్​లోడ్​లో వృద్ధి..

వాట్సాప్​ నిబంధనలతో.. జనవరి 1-5 మధ్య సిగ్నల్​, టెలిగ్రామ్​ డౌన్​లోడ్​లు వరుసగా 24 వేలు, 1.3 మిలియన్​లు పెరిగాయి. సిగ్నల్​ డౌన్​లోడ్​ల వృద్ధి 9,483 శాతంగా ఉండగా.. టెలిగ్రామ్ వృద్ధి 15 శాతంగా నమోదైంది. ఇదే సమయంలో వాట్సాప్​కు జనవరి 6-10 మధ్య డౌన్​లోడ్​లు 35 శాతం పడిపోయాయి.

ఇవీ చూడండి:

Last Updated : Feb 16, 2021, 7:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.