ETV Bharat / opinion

భారత్​తో కయ్యం వెనుక జిన్​పింగ్​ వ్యూహం ఇదే... - ప్రముఖ ఇంటిలిజెన్స్​ ఆఫీసర్​ జయదేవ రనడే

కరోనా సంక్షోభం నుంచి ప్రజల దృష్టి మరల్చి, దేశీయంగా ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకే చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్​ భారత్​తో కయ్యానికి దిగుతున్నారని అభిప్రాయపడ్డారు మాజీ నిఘా అధికారి జయదేవ రనడే. భారత్-చైనా సరిహద్దుల్లో దూకుడు వ్యవహరించాలని డ్రాగన్​ సైన్యానికి ఆయనే స్వయంగా ఆదేశాలిస్తున్నారని ఈటీవీ భారత్​ ముఖాముఖిలో విశ్లేషించారు.

'ఆధిపత్యం కోసం చైనా పాకులాట.. ఇదే జిన్​పింగ్​ వ్యూహం'
china india tensions
author img

By

Published : May 31, 2020, 1:47 PM IST

Updated : May 31, 2020, 5:36 PM IST

సరిహద్దుల్లో భారత్‌-చైనా మధ్య నెలకొన్న ప్రతిష్టంభన మరింత ముదురుతున్న నేపథ్యంలో కీలక విషయాలు వెల్లడించారు మాజీ నిఘా అధికారి​ జయదేవ రనడే. 2017లో డోక్లాం తరహా వివాదానికి దారితీసే అవకాశాలున్నట్లు వస్తున్న సంకేతాలపై ఆయన స్పందించారు. ఈటీవీ భారత్​ సీనియర్​ జర్నలిస్ట్​ స్మితా శర్మతో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా మాట్లాడిన ఆయన.. చైనా భద్రతా దళాలు దూకుడు పెంచడానికి కారణాన్ని వివరించారు. పశ్చిమ ప్రాంతంలో భారత్​పై ఒత్తిడి పెంచి పైచేయి సాధించేందుకు ప్రయత్నించాలని చైనా భావిస్తున్నట్లు రనడే అభిప్రాయపడ్డారు. ఆ దేశ రక్షణ దళాలకు స్వయానా ఆ దేశాధ్యక్షుడి నుంచే సంకేతాలు వస్తున్నట్లు తెలిపారు.

దృష్టి మరల్చేందుకే...

"కరోనా చైనాలోని వుహాన్​లో పుట్టిందని అమెరికా సహా పలు దేశాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల దాదాపు 120కిపైగా దేశాలు కలిసి ఐరాసలో ఓ తీర్మానాన్ని ప్రతిపాదించాయి. ఈ విమర్శలను పక్కదారి పట్టించేందుకు వాస్తవాధీన రేఖ వద్ద జరుగుతున్న పరిణామాలను ఓ అస్త్రంగా మలచుకోవాలని భావిస్తోంది చైనా. ఆసియాలో తమ అధిపత్యం ప్రదర్శించేందుకు అతిపెద్ద దేశమైన భారత్​తో కయ్యానికి కాలుదువ్వుతోంది. ఇప్పటికే చైనాలోనూ జిన్​పింగ్​ ప్రభుత్వంపై ప్రజల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో తన ఆధిపత్యం కాపాడుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు చైనా దేశాధ్యక్షుడు. 2049 నాటికి అగ్రరాజ్యం అమెరికా కంటే శక్తిమంతమైన దేశంగా తయారవ్వాలని వ్యూహాలు రచిస్తున్నారు.

జమ్ముకశ్మీర్​, లద్దాఖ్​ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేయడం చైనాకు ఇష్టంలేదు. పాక్​ ఆక్రమిత కశ్మీర్​లో భారత్​ పట్టు పెంచుకోవడం వల్ల పాక్​-చైనా మధ్య వాణిజ్యానికి ఇబ్బందులు తప్పవని చైనా ప్రభుత్వం భావిస్తోంది. ఇలాంటి సమయంలో భారత్​... తైవాన్​తో కీలకంగా వ్యవహరించాలి. భారత్​ ఆ దేశంతో సత్సంబంధాలు మరింతగా మెరుగుపర్చుకోవడం ద్వారా చైనాకు చెక్​ పెట్టొచ్చు" అని అభిప్రాయపడ్డారు జయదేవ.

2008లో కేబినెట్​ సెక్రటేరియట్​లో అడిషనల్​ సెక్రటరీగా పనిచేసి పదవీ విరమణ పొందిన రనడే... జాతీయ రక్షణ సలహా బోర్డులోనూ సభ్యుడిగా పనిచేశారు.

ఈటీవీ భారత్​ ముఖాముఖిలో మాజీ నిఘా అధికారి జయదేవ రనడే

సరిహద్దుల్లో భారత్‌-చైనా మధ్య నెలకొన్న ప్రతిష్టంభన మరింత ముదురుతున్న నేపథ్యంలో కీలక విషయాలు వెల్లడించారు మాజీ నిఘా అధికారి​ జయదేవ రనడే. 2017లో డోక్లాం తరహా వివాదానికి దారితీసే అవకాశాలున్నట్లు వస్తున్న సంకేతాలపై ఆయన స్పందించారు. ఈటీవీ భారత్​ సీనియర్​ జర్నలిస్ట్​ స్మితా శర్మతో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా మాట్లాడిన ఆయన.. చైనా భద్రతా దళాలు దూకుడు పెంచడానికి కారణాన్ని వివరించారు. పశ్చిమ ప్రాంతంలో భారత్​పై ఒత్తిడి పెంచి పైచేయి సాధించేందుకు ప్రయత్నించాలని చైనా భావిస్తున్నట్లు రనడే అభిప్రాయపడ్డారు. ఆ దేశ రక్షణ దళాలకు స్వయానా ఆ దేశాధ్యక్షుడి నుంచే సంకేతాలు వస్తున్నట్లు తెలిపారు.

దృష్టి మరల్చేందుకే...

"కరోనా చైనాలోని వుహాన్​లో పుట్టిందని అమెరికా సహా పలు దేశాలు ఆరోపిస్తున్నాయి. ఇటీవల దాదాపు 120కిపైగా దేశాలు కలిసి ఐరాసలో ఓ తీర్మానాన్ని ప్రతిపాదించాయి. ఈ విమర్శలను పక్కదారి పట్టించేందుకు వాస్తవాధీన రేఖ వద్ద జరుగుతున్న పరిణామాలను ఓ అస్త్రంగా మలచుకోవాలని భావిస్తోంది చైనా. ఆసియాలో తమ అధిపత్యం ప్రదర్శించేందుకు అతిపెద్ద దేశమైన భారత్​తో కయ్యానికి కాలుదువ్వుతోంది. ఇప్పటికే చైనాలోనూ జిన్​పింగ్​ ప్రభుత్వంపై ప్రజల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో తన ఆధిపత్యం కాపాడుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు చైనా దేశాధ్యక్షుడు. 2049 నాటికి అగ్రరాజ్యం అమెరికా కంటే శక్తిమంతమైన దేశంగా తయారవ్వాలని వ్యూహాలు రచిస్తున్నారు.

జమ్ముకశ్మీర్​, లద్దాఖ్​ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేయడం చైనాకు ఇష్టంలేదు. పాక్​ ఆక్రమిత కశ్మీర్​లో భారత్​ పట్టు పెంచుకోవడం వల్ల పాక్​-చైనా మధ్య వాణిజ్యానికి ఇబ్బందులు తప్పవని చైనా ప్రభుత్వం భావిస్తోంది. ఇలాంటి సమయంలో భారత్​... తైవాన్​తో కీలకంగా వ్యవహరించాలి. భారత్​ ఆ దేశంతో సత్సంబంధాలు మరింతగా మెరుగుపర్చుకోవడం ద్వారా చైనాకు చెక్​ పెట్టొచ్చు" అని అభిప్రాయపడ్డారు జయదేవ.

2008లో కేబినెట్​ సెక్రటేరియట్​లో అడిషనల్​ సెక్రటరీగా పనిచేసి పదవీ విరమణ పొందిన రనడే... జాతీయ రక్షణ సలహా బోర్డులోనూ సభ్యుడిగా పనిచేశారు.

ఈటీవీ భారత్​ ముఖాముఖిలో మాజీ నిఘా అధికారి జయదేవ రనడే
Last Updated : May 31, 2020, 5:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.