ETV Bharat / opinion

ప్రణాళికా లోపాలే లద్దాఖ్​లో సైనికుల పాలిట శాపాలు

author img

By

Published : Aug 11, 2020, 3:09 PM IST

సరిహద్దుల్లో చైనాతో ప్రతిష్టంభన మరింత కాలం కొనసాగే అవకాశం ఉంది. త్వరలో శీతాకాలం రానున్న నేపథ్యంలో సైనికులకు అక్కడి వాతావరణం తట్టుకునేలా ఏర్పాట్లు చేయడం సవాల్​గా మారింది. అయితే ఇదివరకు ఇలాంటి ప్రయత్నాలు ప్రభుత్వం చేపట్టలేదా అంటే.. చేసింది, కానీ వాటి ఫలితాలే ఎవరికీ అర్థంకాని రీతిలో ఉన్నాయి. ఏదేమైనా ఇప్పటికీ సైనికులు ఎముకలు కొరికే చలిలో సాధారణ శిబిరాల్లోనే ఉంటున్నారు.

How shady deals, indecision wrecked high-altitude shelter plan for Indian soldiers
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్

కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇటీవల సమర్పించిన నివేదికపై చర్చించేందుకు ప్రజా పద్దుల కమిటీ సోమవారం సమావేశమైంది. అత్యంత ఎత్తయిన ప్రాంతాల్లో(హెచ్​ఏఏ) సైనికుల జీవన విధానం మెరుగుపర్చే ప్రణాళికలపై తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, ఒప్పందాలపై కాగ్ తన నివేదిక అందించింది. ఈ నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

సరైన స్థావరం ఉంటేనే కదా!

భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు పూర్తిగా సమసిపోకపోవడం, శీతాకాలంలోనూ ఈ ప్రతిష్టంభన కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో సైనికులకు ప్రకృతిని తట్టుకునే విధంగా మౌలిక వసతులు, లాజిస్టిక్ సదుపాయాలు ఏర్పాటు చేయడం ప్రస్తుతం సవాల్​గా మారింది. సరైన ఆశ్రయాలు ఏర్పాటు చేస్తే భారత సైన్యం ఎలాంటి పోరాటానికైనా సంసిద్ధంగా ఉంటుంది. బలగాల మనోస్థైన్యం కూడా దృఢంగా ఉంటుంది.

పైలట్ ప్రాజెక్టులకు బ్రేకులు

ఇక్కడ స్థావరాలు నిర్మించాలన్న రూ.274.11 కోట్ల మూడు పైలట్ ప్రాజెక్టులను 13 ఏళ్ల తర్జనభర్జన తర్వాత నిలిపివేశారు. 2017 నవంబర్​లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మూతపడిన తర్వాత ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. అయితే దీనికి కారణాలేంటన్నది తెలియదు. సెంట్రల్ ఆర్డ్​నెన్స్ ఫాక్టరీకి చెందిన ఈ ప్రాజెక్టు రూపకర్త సైతం కాగ్​ నివేదికలో కారణాలు పొందుపర్చలేదు.

అధ్యయనం కోసం...

అత్యంత ఎత్తులో ఉన్న ఇలాంటి ప్రాంతాల్లో వాతావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు సాధారణంగా ఫైబర్ రీఎన్​ఫోర్స్​డ్ ప్లాస్టిక్(ఎఫ్​ఆర్​పీ), ఫైబర్ గ్లాస్ కుటీరాల(ఎఫ్​జీహెచ్​)ను... స్థావరాల కోసం ఉపయోగిస్తారు.

ఈ ప్రాంతంలో నివాస సౌకర్యాలు మెరుగుపర్చేందుకు భారత సైన్యం 2007లో నార్తర్న్ కమాండ్ చీఫ్ ఇంజినీర్ ఆధ్వర్యంలో అధ్యయనం నిర్వహించింది. శిబిరాలు ఏర్పాటు చేసేందుకు అవసరమయ్యే ప్రామాణిక నమూనా, నిధులు, సమయంపై పరిశీలన చేసింది.

2008 ఏప్రిల్​లో ఈ అధ్యయనానికి సంబంధించిన నివేదిక సైన్యానికి సమర్పించింది. ఐదు సంవత్సరాల్లో పూర్తి చేసే విధంగా రూ. 3,180 కోట్లతో ప్రాజెక్టు పూర్తి చేయవచ్చని అంచనా వేసింది.

ఫేజ్ 1 ప్రారంభం- సవాళ్లు

ఇలాంటి ఎత్తయిన ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞనాన్ని పరీక్షించడానికి రక్షణ మంత్రిత్వ శాఖ రూ. 95 కోట్లతో పైలట్ ప్రాజెక్టు(ఫేజ్ 1)ను ప్రారంభించింది. అయితే సెలెక్టివ్ టెండరింగ్ కోసం రక్షణ శాఖ విధించిన నిబంధన గందరగోళంగా ఉంది.

"హై ఆల్టిట్యూడ్ ప్రాంతాల్లో కొత్త సాంకేతికతను పరీక్షించడం పైలట్ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. సెలెక్టివ్ టెండరింగ్, ఓపెన్/ గ్లోబల్ టెండర్ల వల్ల ఈ ప్రాజెక్టు ఉద్దేశం పూర్తిగా దెబ్బతింది."

-కాగ్ నివేదిక

తొలి ప్రాజెక్టుకు సంబంధించి ఫేజ్ 1 ముగియక ముందే 2010 ఆగస్టులో రెండో పైలట్ ప్రాజెక్టు, 2013 డిసెంబర్​లో మూడో పైలట్ ప్రాజెక్టు కోసం రూ. 163.65 కోట్ల నిధులు మంజూరు చేసింది రక్షణ శాఖ.

కన్సల్టెన్సీలో మతలబు!

2007 అక్టోబర్​లో అధ్యయనం ప్రారంభం కాగా.. అదే సమయంలో ఓ ఆర్మీ అధికారి ప్రారంభించిన కన్సల్టెన్సీ ఈ హక్కులను సొంతం చేసుకుంది. రెండు, మూడు ఫేజ్​లకు కూడా కన్సల్టెన్సీ హక్కులు ఈ సంస్థనే వరించాయి. ఇది ఆశ్చర్యం కలిగించే విషయం.

కన్సల్టెన్సీ సర్వీసుల కోసం రక్షణ శాఖ 7.38 కోట్లు(3 శాతం) మంజూరు చేయగా.. చివరకు మూడు దశలకు కలిపి రూ. 11.39 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. ఇది 4.01 కోట్లు అదనం.

ఫలితంగా, లద్దాఖ్​ సహా పరిసర ప్రాంతాల్లో.. గడ్డకట్టే చలిలో, ఆక్సిజన్ కూడా అందని ప్రాంతంలో ప్రకృతి సవాళ్లను తట్టుకొని ఆశ్రయం పొందాల్సిన జవానులు.. నిస్సారమైన స్థావరాల్లో ఉంటున్నారు.

(రచయిత-సంజీవ్ బారువా)

కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇటీవల సమర్పించిన నివేదికపై చర్చించేందుకు ప్రజా పద్దుల కమిటీ సోమవారం సమావేశమైంది. అత్యంత ఎత్తయిన ప్రాంతాల్లో(హెచ్​ఏఏ) సైనికుల జీవన విధానం మెరుగుపర్చే ప్రణాళికలపై తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, ఒప్పందాలపై కాగ్ తన నివేదిక అందించింది. ఈ నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

సరైన స్థావరం ఉంటేనే కదా!

భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు పూర్తిగా సమసిపోకపోవడం, శీతాకాలంలోనూ ఈ ప్రతిష్టంభన కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో సైనికులకు ప్రకృతిని తట్టుకునే విధంగా మౌలిక వసతులు, లాజిస్టిక్ సదుపాయాలు ఏర్పాటు చేయడం ప్రస్తుతం సవాల్​గా మారింది. సరైన ఆశ్రయాలు ఏర్పాటు చేస్తే భారత సైన్యం ఎలాంటి పోరాటానికైనా సంసిద్ధంగా ఉంటుంది. బలగాల మనోస్థైన్యం కూడా దృఢంగా ఉంటుంది.

పైలట్ ప్రాజెక్టులకు బ్రేకులు

ఇక్కడ స్థావరాలు నిర్మించాలన్న రూ.274.11 కోట్ల మూడు పైలట్ ప్రాజెక్టులను 13 ఏళ్ల తర్జనభర్జన తర్వాత నిలిపివేశారు. 2017 నవంబర్​లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మూతపడిన తర్వాత ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. అయితే దీనికి కారణాలేంటన్నది తెలియదు. సెంట్రల్ ఆర్డ్​నెన్స్ ఫాక్టరీకి చెందిన ఈ ప్రాజెక్టు రూపకర్త సైతం కాగ్​ నివేదికలో కారణాలు పొందుపర్చలేదు.

అధ్యయనం కోసం...

అత్యంత ఎత్తులో ఉన్న ఇలాంటి ప్రాంతాల్లో వాతావరణ సవాళ్లను ఎదుర్కొనేందుకు సాధారణంగా ఫైబర్ రీఎన్​ఫోర్స్​డ్ ప్లాస్టిక్(ఎఫ్​ఆర్​పీ), ఫైబర్ గ్లాస్ కుటీరాల(ఎఫ్​జీహెచ్​)ను... స్థావరాల కోసం ఉపయోగిస్తారు.

ఈ ప్రాంతంలో నివాస సౌకర్యాలు మెరుగుపర్చేందుకు భారత సైన్యం 2007లో నార్తర్న్ కమాండ్ చీఫ్ ఇంజినీర్ ఆధ్వర్యంలో అధ్యయనం నిర్వహించింది. శిబిరాలు ఏర్పాటు చేసేందుకు అవసరమయ్యే ప్రామాణిక నమూనా, నిధులు, సమయంపై పరిశీలన చేసింది.

2008 ఏప్రిల్​లో ఈ అధ్యయనానికి సంబంధించిన నివేదిక సైన్యానికి సమర్పించింది. ఐదు సంవత్సరాల్లో పూర్తి చేసే విధంగా రూ. 3,180 కోట్లతో ప్రాజెక్టు పూర్తి చేయవచ్చని అంచనా వేసింది.

ఫేజ్ 1 ప్రారంభం- సవాళ్లు

ఇలాంటి ఎత్తయిన ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞనాన్ని పరీక్షించడానికి రక్షణ మంత్రిత్వ శాఖ రూ. 95 కోట్లతో పైలట్ ప్రాజెక్టు(ఫేజ్ 1)ను ప్రారంభించింది. అయితే సెలెక్టివ్ టెండరింగ్ కోసం రక్షణ శాఖ విధించిన నిబంధన గందరగోళంగా ఉంది.

"హై ఆల్టిట్యూడ్ ప్రాంతాల్లో కొత్త సాంకేతికతను పరీక్షించడం పైలట్ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. సెలెక్టివ్ టెండరింగ్, ఓపెన్/ గ్లోబల్ టెండర్ల వల్ల ఈ ప్రాజెక్టు ఉద్దేశం పూర్తిగా దెబ్బతింది."

-కాగ్ నివేదిక

తొలి ప్రాజెక్టుకు సంబంధించి ఫేజ్ 1 ముగియక ముందే 2010 ఆగస్టులో రెండో పైలట్ ప్రాజెక్టు, 2013 డిసెంబర్​లో మూడో పైలట్ ప్రాజెక్టు కోసం రూ. 163.65 కోట్ల నిధులు మంజూరు చేసింది రక్షణ శాఖ.

కన్సల్టెన్సీలో మతలబు!

2007 అక్టోబర్​లో అధ్యయనం ప్రారంభం కాగా.. అదే సమయంలో ఓ ఆర్మీ అధికారి ప్రారంభించిన కన్సల్టెన్సీ ఈ హక్కులను సొంతం చేసుకుంది. రెండు, మూడు ఫేజ్​లకు కూడా కన్సల్టెన్సీ హక్కులు ఈ సంస్థనే వరించాయి. ఇది ఆశ్చర్యం కలిగించే విషయం.

కన్సల్టెన్సీ సర్వీసుల కోసం రక్షణ శాఖ 7.38 కోట్లు(3 శాతం) మంజూరు చేయగా.. చివరకు మూడు దశలకు కలిపి రూ. 11.39 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. ఇది 4.01 కోట్లు అదనం.

ఫలితంగా, లద్దాఖ్​ సహా పరిసర ప్రాంతాల్లో.. గడ్డకట్టే చలిలో, ఆక్సిజన్ కూడా అందని ప్రాంతంలో ప్రకృతి సవాళ్లను తట్టుకొని ఆశ్రయం పొందాల్సిన జవానులు.. నిస్సారమైన స్థావరాల్లో ఉంటున్నారు.

(రచయిత-సంజీవ్ బారువా)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.