ETV Bharat / opinion

'చతుర్భుజ విన్యాసాల'తో చైనాకు చెక్​!

author img

By

Published : Oct 21, 2020, 7:25 AM IST

చైనా దుందుడుకు చర్యలకు అడ్డుకట్టవేయడానికి అమెరికా, జపాన్‌, ఇండియా, ఆస్ట్రేలియాల చతుర్భుజ(క్వాడ్‌) భద్రతా చర్యల యంత్రాంగం రూపుదిద్దుకుంది. అంతేకాదు మరో పక్షం రోజుల్లో నాలుగు దేశాల మలబార్‌ నౌకాదళ విన్యాసాలకూ రంగం సిద్ధమైంది. చైనా ఆధిపత్య ధోరణిని నిలువరించేందుకే ఈ విన్యాసాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో క్యాడ్​​ కార్యచరణ ఎలా ఉండబోతుందన్న దానిపై ప్రత్యేక కథనం.

A special story on Quad countries Malabar naval exercises
చతుర్భుజ విన్యాసాలతో చైనాకు చెక్​!

పోఖ్రాన్‌ అణుపరీక్షల దరిమిలా అసంబద్ధ ఆంక్షలకు గురైన ఇండియా అచిరకాలంలోనే అగ్రదేశాలన్నింటితో వ్యూహాత్మక భాగస్వామ్య ఒడంబడికలతో ధీమాగా ముందడుగేయగలిగిందంటే- అదంతా వాజ్‌పేయీ రాజనీతిజ్ఞత చలవే. ఒకరికి చేరువ అవుతున్నామంటే అర్థం మరో దేశానికి దూరం జరుగుతున్నట్లు కాదన్న వాజ్‌పేయీ వ్యాఖ్యలో ధ్వనించింది అలీనోద్యమ భావనే. కొత్త సహస్రాబ్దిలో రెండు దశాబ్దాల్లోనే భౌగోళిక రాజకీయ వాతావరణం గణనీయంగా మారిపోయింది. 2004నాటి హిందూ మహా సముద్ర సునామీ బాధితుల్ని ఆదుకోవడానికి చేతులు కలిపి సఫలమైన దేశాల్లో- ఆ సహకారాన్ని వ్యవస్థీకృతం చేయాలన్న ఆలోచన మొగ్గ తొడిగింది.

హిందూ, పసిఫిక్‌ సముద్ర తీర దేశాల్లో స్వేచ్ఛా సౌభాగ్యాలే 'విజన్‌'గా ఓ 'బృందం' ఏర్పడాలన్న అప్పటి జపాన్‌ ప్రధాని షింజో అబే ఆకాంక్ష- 2006నాటి దిల్లీ, టోక్యోల సంయుక్త ప్రకటనలోనూ ప్రస్తావనకు నోచుకొంది. 2007నాటి ప్రాథమిక సంప్రదింపుల దశలోనే... ఎందుకు, ఏమిటీ అంటూ బీజింగ్‌ ఆరాలు మొదలు పెట్టగానే, ఆ యత్నం కొడిగట్టిపోయింది. మళ్ళీ ఇన్నేళ్లకు అమెరికా, జపాన్‌, ఇండియా, ఆస్ట్రేలియాల చతుర్భుజ(క్వాడ్‌) భద్రతా చర్యల యంత్రాంగం రూపుదిద్దుకోవడమే కాదు... మరో పక్షం రోజుల్లో నాలుగు దేశాల మలబార్‌ నౌకాదళ విన్యాసాలకూ రంగం సిద్ధమైంది.

జాగ్రత్త వహించాలి!

ఆసియా పసిఫిక్‌ ప్రాంతానికి ఇండో పసిఫిక్‌గా నామకరణం చేసిన ట్రంప్‌ సర్కారు 2017నాటి జాతీయ భద్రతా వ్యూహ పత్రంలోనే చైనా దూకుడుపై గళమెత్తింది. 'ఆసియా నాటో' కూటమి రూపకల్పనకు వాషింగ్టన్‌ సిద్ధపడుతోందని బీజింగ్‌ విమర్శిస్తున్నా- చైనా దుందుడుకు వ్యవహారశైలే ఇండియా, ఆస్ట్రేలియాల తాజా క్రియాశీలతకు ప్రేరకమైంది. 'క్వాడ్‌' సభ్యదేశాలన్నింటికీ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయిన చైనా- ప్రచ్ఛన్న యుద్ధభావజాలంతోనే తాజా భౌగోళిక రాజకీయ పోటీకి తెరలేచిందంటుంటే, బీజింగ్‌ దురాక్రమణను ఎదుర్కొనే కూటమిగా క్వాడ్‌ నిర్మాణం సాగాలని అమెరికా అభిలషిస్తోంది. ఈ అడకత్తెరలో పోకచెక్కలా మారకుండా ఇండియా జాగ్రత్త వహించాలి!

క్వాడ్‌ సభ్యదేశాల్లో ఇండియా ఒక్కదానికే చైనాతో విస్తృత భౌగోళిక సరిహద్దు ఉంది. గత 2,200 సంవత్సరాలుగా ఇండియా-చైనాల మధ్య సౌహార్ద సంబంధాలే ఉన్నాయని చైనా ప్రధానిగా వెన్‌జియబావో లోగడ సూత్రీకరించినా- కొన్ని నెలలుగా సరిహద్దుల్లో బీజింగ్‌ కయ్యానికే కాలు దువ్వుతోంది. 1959లో చైనా ప్రతిపాదించిన సరిహద్దుల్ని భారత్‌ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చినా, దానికే ఇండియా కట్టుబడాలంటున్న బీజింగ్‌ తన మంకుపట్టుతో శాంతి ప్రక్రియకు మోకాలడ్డుతోంది. చారిత్రకంగా దక్షిణ చైనా సముద్రంపై గుత్తాధిపత్యం తనదేనంటూ అక్కడ కృత్రిమ దీవుల సృష్టికి, సైనిక స్థావరాల విస్తరణకూ సమకట్టిన బీజింగుకు 2016లో అంతర్జాతీయ ట్రైబ్యునల్‌లో చుక్కెదురైంది.

నౌకాయానం స్వేచ్ఛగా సాగేందుకు...

ఆ తీర్పును అసలు గుర్తించేదే లేదన్న చైనా దురహంకార ధోరణులు ఆయా దేశాలన్నింటికీ కలవరకారకమవుతున్నాయి. యుద్ధానికి సిద్ధం కావాలంటూ అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీకి ఇచ్చిన ఆదేశాలూ ఉద్రిక్తతల్ని పెంచుతున్నాయి. 2002, 2016, 2018 సంవత్సరాల్లో కీలక ఒడంబడికల దరిమిలా ఈ నెలలోనే బేసిక్‌ ఎక్స్‌చేంజీ అండ్‌ కో ఆపరేషన్‌ అగ్రిమెంట్‌ (బెకా)తో సైనికంగా అమెరికాకు ఇండియా మరింత సన్నిహితం కానుంది. హిందూ మహాసముద్రమే కాదు- తక్కిన అన్నింటా నౌకాయానం స్వేచ్ఛగా సాగేందుకు, సముద్రాలపై గుత్తాధిపత్య దేశాల భీతి లేకుండా వాణిజ్యం జరిగేందుకు 'క్వాడ్‌' మంచి ఏర్పాటు కాగలదని జనరల్‌ రావత్‌ చెబుతున్నారు. సర్వానర్థకరమైన యుద్ధాలన్నింటికీ ఆధిపత్య ధోరణులే కారణమైన దృష్ట్యా- 'క్వాడ్‌'ను కూటమిగా కాక, బహుళపక్ష వేదికగా విస్తరించినప్పుడే ప్రచ్ఛన్న యుద్ధ ఛాయల ముసురునుంచి ప్రపంచం తెరిపిన పడేది!

ఇదీ చూడండి: 'నీట్' ఫలితాల్లో ఎలాంటి తప్పులు లేవు: ఎన్​టీఏ

పోఖ్రాన్‌ అణుపరీక్షల దరిమిలా అసంబద్ధ ఆంక్షలకు గురైన ఇండియా అచిరకాలంలోనే అగ్రదేశాలన్నింటితో వ్యూహాత్మక భాగస్వామ్య ఒడంబడికలతో ధీమాగా ముందడుగేయగలిగిందంటే- అదంతా వాజ్‌పేయీ రాజనీతిజ్ఞత చలవే. ఒకరికి చేరువ అవుతున్నామంటే అర్థం మరో దేశానికి దూరం జరుగుతున్నట్లు కాదన్న వాజ్‌పేయీ వ్యాఖ్యలో ధ్వనించింది అలీనోద్యమ భావనే. కొత్త సహస్రాబ్దిలో రెండు దశాబ్దాల్లోనే భౌగోళిక రాజకీయ వాతావరణం గణనీయంగా మారిపోయింది. 2004నాటి హిందూ మహా సముద్ర సునామీ బాధితుల్ని ఆదుకోవడానికి చేతులు కలిపి సఫలమైన దేశాల్లో- ఆ సహకారాన్ని వ్యవస్థీకృతం చేయాలన్న ఆలోచన మొగ్గ తొడిగింది.

హిందూ, పసిఫిక్‌ సముద్ర తీర దేశాల్లో స్వేచ్ఛా సౌభాగ్యాలే 'విజన్‌'గా ఓ 'బృందం' ఏర్పడాలన్న అప్పటి జపాన్‌ ప్రధాని షింజో అబే ఆకాంక్ష- 2006నాటి దిల్లీ, టోక్యోల సంయుక్త ప్రకటనలోనూ ప్రస్తావనకు నోచుకొంది. 2007నాటి ప్రాథమిక సంప్రదింపుల దశలోనే... ఎందుకు, ఏమిటీ అంటూ బీజింగ్‌ ఆరాలు మొదలు పెట్టగానే, ఆ యత్నం కొడిగట్టిపోయింది. మళ్ళీ ఇన్నేళ్లకు అమెరికా, జపాన్‌, ఇండియా, ఆస్ట్రేలియాల చతుర్భుజ(క్వాడ్‌) భద్రతా చర్యల యంత్రాంగం రూపుదిద్దుకోవడమే కాదు... మరో పక్షం రోజుల్లో నాలుగు దేశాల మలబార్‌ నౌకాదళ విన్యాసాలకూ రంగం సిద్ధమైంది.

జాగ్రత్త వహించాలి!

ఆసియా పసిఫిక్‌ ప్రాంతానికి ఇండో పసిఫిక్‌గా నామకరణం చేసిన ట్రంప్‌ సర్కారు 2017నాటి జాతీయ భద్రతా వ్యూహ పత్రంలోనే చైనా దూకుడుపై గళమెత్తింది. 'ఆసియా నాటో' కూటమి రూపకల్పనకు వాషింగ్టన్‌ సిద్ధపడుతోందని బీజింగ్‌ విమర్శిస్తున్నా- చైనా దుందుడుకు వ్యవహారశైలే ఇండియా, ఆస్ట్రేలియాల తాజా క్రియాశీలతకు ప్రేరకమైంది. 'క్వాడ్‌' సభ్యదేశాలన్నింటికీ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయిన చైనా- ప్రచ్ఛన్న యుద్ధభావజాలంతోనే తాజా భౌగోళిక రాజకీయ పోటీకి తెరలేచిందంటుంటే, బీజింగ్‌ దురాక్రమణను ఎదుర్కొనే కూటమిగా క్వాడ్‌ నిర్మాణం సాగాలని అమెరికా అభిలషిస్తోంది. ఈ అడకత్తెరలో పోకచెక్కలా మారకుండా ఇండియా జాగ్రత్త వహించాలి!

క్వాడ్‌ సభ్యదేశాల్లో ఇండియా ఒక్కదానికే చైనాతో విస్తృత భౌగోళిక సరిహద్దు ఉంది. గత 2,200 సంవత్సరాలుగా ఇండియా-చైనాల మధ్య సౌహార్ద సంబంధాలే ఉన్నాయని చైనా ప్రధానిగా వెన్‌జియబావో లోగడ సూత్రీకరించినా- కొన్ని నెలలుగా సరిహద్దుల్లో బీజింగ్‌ కయ్యానికే కాలు దువ్వుతోంది. 1959లో చైనా ప్రతిపాదించిన సరిహద్దుల్ని భారత్‌ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చినా, దానికే ఇండియా కట్టుబడాలంటున్న బీజింగ్‌ తన మంకుపట్టుతో శాంతి ప్రక్రియకు మోకాలడ్డుతోంది. చారిత్రకంగా దక్షిణ చైనా సముద్రంపై గుత్తాధిపత్యం తనదేనంటూ అక్కడ కృత్రిమ దీవుల సృష్టికి, సైనిక స్థావరాల విస్తరణకూ సమకట్టిన బీజింగుకు 2016లో అంతర్జాతీయ ట్రైబ్యునల్‌లో చుక్కెదురైంది.

నౌకాయానం స్వేచ్ఛగా సాగేందుకు...

ఆ తీర్పును అసలు గుర్తించేదే లేదన్న చైనా దురహంకార ధోరణులు ఆయా దేశాలన్నింటికీ కలవరకారకమవుతున్నాయి. యుద్ధానికి సిద్ధం కావాలంటూ అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీకి ఇచ్చిన ఆదేశాలూ ఉద్రిక్తతల్ని పెంచుతున్నాయి. 2002, 2016, 2018 సంవత్సరాల్లో కీలక ఒడంబడికల దరిమిలా ఈ నెలలోనే బేసిక్‌ ఎక్స్‌చేంజీ అండ్‌ కో ఆపరేషన్‌ అగ్రిమెంట్‌ (బెకా)తో సైనికంగా అమెరికాకు ఇండియా మరింత సన్నిహితం కానుంది. హిందూ మహాసముద్రమే కాదు- తక్కిన అన్నింటా నౌకాయానం స్వేచ్ఛగా సాగేందుకు, సముద్రాలపై గుత్తాధిపత్య దేశాల భీతి లేకుండా వాణిజ్యం జరిగేందుకు 'క్వాడ్‌' మంచి ఏర్పాటు కాగలదని జనరల్‌ రావత్‌ చెబుతున్నారు. సర్వానర్థకరమైన యుద్ధాలన్నింటికీ ఆధిపత్య ధోరణులే కారణమైన దృష్ట్యా- 'క్వాడ్‌'ను కూటమిగా కాక, బహుళపక్ష వేదికగా విస్తరించినప్పుడే ప్రచ్ఛన్న యుద్ధ ఛాయల ముసురునుంచి ప్రపంచం తెరిపిన పడేది!

ఇదీ చూడండి: 'నీట్' ఫలితాల్లో ఎలాంటి తప్పులు లేవు: ఎన్​టీఏ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.