రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని కమ్మగూడలో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. తన కూతురు ఆత్మహత్య చేసుకోవడానికి సరూర్నగర్కు చెందిన నరేందర్ అనే వివాహితుడే కారణమని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మానసికంగా కుంగిపోయింది..
ఇంజినీరింగ్ చదివిన తన కూతురు ఒక సాఫ్ట్వేర్ కోర్స్లో శిక్షణ పొందేదని... ఈ క్రమంలో నరేందర్తో పరిచయం ఏర్పడిందని మృతురాలి తండ్రి దేవరకద్ర నరేందర్ గౌడ్ తెలిపాడు. అమాయకురాలైన తన కూతురు నరేందర్ మాయలో పడి మానసికంగా కుంగిపోయి.. కుటుంబ సభ్యులందరితో వింతగా ప్రవర్తించేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ క్రమంలోనే తన కూతురు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని పేర్కొన్నాడు. దీనికి కారకుడైన నరేందర్ను కఠినంగా శిక్షించాలని మృతురాలి తండ్రి వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు.
ఇదీ చూడండి: పాము కాటుకు ఇంటర్ విద్యార్థిని బలి