ETV Bharat / jagte-raho

రోడ్డు దాటుతుంటే సిమెంట్ మిక్సర్ ట్రక్​ ఢీ.. మహిళ మృతి - సూరారం రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు దాటుతుండగా సిమెంట్ మిక్సర్ ట్రక్ ఢీకొనడంతో ఓ మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. ఈ ఘటన మేడ్చల్​ జిల్లా సూరారంలో జరిగింది. లారీ డ్రైవర్​ పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

road accident in suraram woman died
రోడ్డు దాటుతుండగా టిప్పర్​ లారీ ఢీకొట్టి.. మహిళ మృతి
author img

By

Published : Dec 30, 2020, 12:28 PM IST

విధులకు వెళ్తుండగా రోడ్డు దాటుతున్న సమయంలో టిప్పర్​ లారీ ఢీ కొని ఓ మహిళ మృత్యువాత పడింది. మేడ్చల్​ జిల్లా జీడిమెట్లకు చెందిన సుశీలమ్మ(54).. సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రిలో హౌస్​ కీపర్​గా పనిచేస్తోంది. బుధవారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు ఆస్పత్రి ఎదురుగా రోడ్డు దాటుతుండగా అకస్మాత్తుగా లారీ ఢీ కొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

రోడ్డు దాటుతుండగా టిప్పర్​ లారీ ఢీ.. మహిళ మృతి

కేసు నమోదు చేసుకున్న దుండిగల్​ పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్​ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: బ్రహ్మోత్సవాల్లో అపశృతి.. కరెంట్​ షాక్​తో ఉద్యోగి మృతి!

విధులకు వెళ్తుండగా రోడ్డు దాటుతున్న సమయంలో టిప్పర్​ లారీ ఢీ కొని ఓ మహిళ మృత్యువాత పడింది. మేడ్చల్​ జిల్లా జీడిమెట్లకు చెందిన సుశీలమ్మ(54).. సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రిలో హౌస్​ కీపర్​గా పనిచేస్తోంది. బుధవారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు ఆస్పత్రి ఎదురుగా రోడ్డు దాటుతుండగా అకస్మాత్తుగా లారీ ఢీ కొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

రోడ్డు దాటుతుండగా టిప్పర్​ లారీ ఢీ.. మహిళ మృతి

కేసు నమోదు చేసుకున్న దుండిగల్​ పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్​ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: బ్రహ్మోత్సవాల్లో అపశృతి.. కరెంట్​ షాక్​తో ఉద్యోగి మృతి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.