ETV Bharat / jagte-raho

విషాదం: సిమెంట్​ ట్యాంకర్​ ఢీకొని మహిళ మృతి

author img

By

Published : Nov 24, 2020, 7:00 PM IST

రంగారెడ్డి జిల్లా అజిజ్​నగర్​ గేట్​ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సిమెంట్​ ట్యాంకర్​ ఢీకొని ఓ మహిళ మృత్యువాతపడింది. ఈ ఘటనలో ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి.

విషాదం: సిమెంట్​ ట్యాంకర్​ ఢీకొని మహిళ మృతి
విషాదం: సిమెంట్​ ట్యాంకర్​ ఢీకొని మహిళ మృతి

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్​ మండలంలోని అజిజ్​నగర్​ గేట్​ సమీపంలో సిమెంట్​ ట్యాంకర్ వాహనం​ ఢీకొని మహిళ మృతి చెందింది. మృతి చెందిన మహిళ కాళీ మందిర్​ వాసిగా గుర్తించారు.

కాళీ మందిర్​ నుంచి భార్యాభర్తలు ఇద్దరు లునాపై మొయినాబాద్​ మండలంలోని ఎనికేపల్లి గ్రామంలో జరిగే ఫంక్షన్​కు వెళ్తున్నారు. అజిజ్​ నగర్​ గేట్​ సమీపానికి రాగానే సిమెంట్​ ట్యాంకర్​ ఢీకొంది. ఈ ఘటనలో భార్య తలకు బలంగా తగలడం వల్ల ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. భర్తకు తీవ్రగాయాలయ్యాయి. ఘటనా స్థలికి చేరుకున్న మొయినాబాద్​ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్​ మండలంలోని అజిజ్​నగర్​ గేట్​ సమీపంలో సిమెంట్​ ట్యాంకర్ వాహనం​ ఢీకొని మహిళ మృతి చెందింది. మృతి చెందిన మహిళ కాళీ మందిర్​ వాసిగా గుర్తించారు.

కాళీ మందిర్​ నుంచి భార్యాభర్తలు ఇద్దరు లునాపై మొయినాబాద్​ మండలంలోని ఎనికేపల్లి గ్రామంలో జరిగే ఫంక్షన్​కు వెళ్తున్నారు. అజిజ్​ నగర్​ గేట్​ సమీపానికి రాగానే సిమెంట్​ ట్యాంకర్​ ఢీకొంది. ఈ ఘటనలో భార్య తలకు బలంగా తగలడం వల్ల ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. భర్తకు తీవ్రగాయాలయ్యాయి. ఘటనా స్థలికి చేరుకున్న మొయినాబాద్​ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.