యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామ శివారులోని రైస్మిల్లు వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా గుట్ట ఎస్సై యాదయ్య అక్కడకు చేరుకుని దర్యాప్తు జరిపారు.
మృతుడి వయసు సమారు 45ఏళ్లు ఉంటాయని.. అతని వద్ద ఎటువంటి ఆధారాలు లేకపోవడం వల్ల గుర్తుతెలియని వ్యక్తి కింద కేసు నమోదు చేసుకున్నామని తెలిపారు. ఈమేరకు దర్యాప్తు చేపట్టిన్నట్టు వెల్లడించారు.
ఇదీ చూడండి: మద్యం మత్తులో డ్రైవింగ్.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం