రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు... హైదరాబాద్ పాతబస్తీలో నివాసం ఉంటున్న ఆ కుటుంబాన్ని విషాదంతో నింపేశాయి. హజీమహ్మద్ సుమారు 80 ఏళ్లుగా... కుటుంబంతో హుస్సేని ఆలంలో నివాసముంటున్నారు. రేకుల ఇల్లు పాతది కావడంతో....వర్షాలకు గోడలు పూర్తిగా నానిపోయి... ఒక్కసారిగా కూలింది. ఈ ప్రమాదంలో కూతురితో పాటు కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి.
స్థానికులు వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించినా... కోడలు ఫిరాబేగం, కూతురు అనీజ్ బేగం ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన కుటుంబ సభ్యులు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది భవనాన్ని కూల్చివేశారు.
ఇదీ చూడండి: రాజీవ్ రహదారిపై కారు, ద్విచక్రవాహనం ఢీ... ఒకరు మృతి