ETV Bharat / jagte-raho

విషాదం: ట్రాక్టర్ బోల్తా పడి ఓ యువకుడి మృతి

author img

By

Published : Nov 9, 2020, 6:59 PM IST

ప్రమాదవశాత్తు ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాద ఘటన నిజాంసాగర్ మండల కేంద్రంలో జరిగింది. ఈ మరణంతో ఇరు కుటుంబాలు విలపించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది.

tractor overturned and a man was died at magi village
విషాదం: ట్రాక్టర్ బోల్తా పడి ఓ యువకుడి మృతి

వివాహమై సంవత్సరం తిరగకముందే ట్రాక్టర్ బోల్తా పడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామానికి చెందిన మామిండ్ల మహేష్(25) గ్రామ శివారులో పొలంలో వరి పంట నూర్పిడి చేస్తున్నాడు. ప్రమాదవశాత్తు ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడి.. అక్కడికక్కడే మృతి చెందాడు.

మృతుడికి ఎనిమిది నెలల క్రితమే వివాహమైంది. ఈ ఘటనతో ఇరు కుటుంబాలు శోక సంద్రంలో మునిగిపోయాయి. మహేష్ మృతితో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

వివాహమై సంవత్సరం తిరగకముందే ట్రాక్టర్ బోల్తా పడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామానికి చెందిన మామిండ్ల మహేష్(25) గ్రామ శివారులో పొలంలో వరి పంట నూర్పిడి చేస్తున్నాడు. ప్రమాదవశాత్తు ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడి.. అక్కడికక్కడే మృతి చెందాడు.

మృతుడికి ఎనిమిది నెలల క్రితమే వివాహమైంది. ఈ ఘటనతో ఇరు కుటుంబాలు శోక సంద్రంలో మునిగిపోయాయి. మహేష్ మృతితో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చూడండి: ప్రేమపేరుతో దారుణం.. గుంటూరు జిల్లాలో యువతి హత్య..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.