నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలో శనివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు 2 వాహనాలకు నిప్పంటించారు. కమలాకర్రావు అనే రైతు ఇంటి ముందు నిలిపి ఉంచిన వాహనాలను తగలబెట్టారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చర్యకు పాల్పడిన దుండగులపై చర్యలు తీసుకుని తమకు నష్ట పరిహారం ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు.