వడ్డీ లేకుండా రుణాలిస్తామని ఆశపెట్టి భారీ బంగారంతో పరారైన కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు తమిళనాడు పోలీసులు తెలిపారు. చెన్నై టీనగర్లో ఇఫ్జర్ రెహమాన్.. ఆయన సోదరుడు హిప్సార్ అనీస్ రెహమాన్.. రాయల్ రూబీ జ్యువెలరీ దుకాణం నిర్వహించేవారు. బంగారు నగలపై వడ్డీ లేకుండా రుణాలిస్తామని చెప్పి సుమారు 1500 మంది నుంచి బంగారం సేకరించి పరారయ్యారు.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధి పటేల్గూడలో నిందితులను గుర్తించిన తమిళ పోలీసులు.. వారిని అరెస్టు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా రెహమాన్ బ్రదర్స్లో ఒకరిని సంగారెడ్డి జిల్లా పటేల్గూలోని తన నివాసానికి తీసుకువచ్చి విచారణ చేస్తున్నారు. విచారణలో వెల్లడైన విషయాలు, కేసు గురించిన వివరాలను ఈనెల 22న వెల్లడిస్తామని తమిళ పోలీసులు తెలిపారు.
- ఇదీ చూడండి : చెన్నై ఎయిర్పోర్ట్లో రూ. 4.5 కోట్ల బంగారం సీజ్