ETV Bharat / jagte-raho

ఆరేళ్ల బాలుడిని బలితీసుకున్న లారీ

author img

By

Published : Dec 13, 2020, 3:31 PM IST

ఊహించని రోడ్డు ప్రమాదం ఆరేళ్ల బాలుడిని బలితీసుకుంది. ద్విచక్రవాహనంపై బయలుదేరిన కాసేపటికే మృత్యువు కబళించింది. తండ్రి స్నేహితుడు ఉపేందర్​తో కలిసి దుకాణానికి వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొనడంతో తలకు తీవ్రగాయాలై బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా తిరుమలగిరి క్రాస్​ రోడ్డులో జరిగింది.

six years boy died in road accident at thirumalagiri in suryapeta district
ఆరేళ్ల బాలుడిని బలితీసుకున్న లారీ

సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో విషాదం చోటుచేసుకుంది. ఊహించని రోడ్డు ప్రమాదం ఆరేళ్ల బాలుడి నూరేళ్ల జీవితాన్ని చిదిమేసింది. తండ్రి స్నేహితుడు ఉపేందర్​తో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొనడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన తిరుమలగిరి క్రాస్​ రోడ్డులో జరిగింది.

తిరుమలగిరికి చెందిన కూరగాయల వ్యాపారి దిలీప్​, శ్రావణిల కుమారుడు దిశాంత్(6) ఈ ప్రమాదంలో మరణించాడు. లారీ వెనుక చక్రాల కింద పడడంతో బాలుడి తలకు తీవ్ర గాయాలై మృత్యువాత పడ్డాడు.

ఇదీ చూడండి:మహిళా పోలీసుల సంఖ్య పెరగాలి: డీఐజీ సుమతి

సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో విషాదం చోటుచేసుకుంది. ఊహించని రోడ్డు ప్రమాదం ఆరేళ్ల బాలుడి నూరేళ్ల జీవితాన్ని చిదిమేసింది. తండ్రి స్నేహితుడు ఉపేందర్​తో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొనడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన తిరుమలగిరి క్రాస్​ రోడ్డులో జరిగింది.

తిరుమలగిరికి చెందిన కూరగాయల వ్యాపారి దిలీప్​, శ్రావణిల కుమారుడు దిశాంత్(6) ఈ ప్రమాదంలో మరణించాడు. లారీ వెనుక చక్రాల కింద పడడంతో బాలుడి తలకు తీవ్ర గాయాలై మృత్యువాత పడ్డాడు.

ఇదీ చూడండి:మహిళా పోలీసుల సంఖ్య పెరగాలి: డీఐజీ సుమతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.