ETV Bharat / jagte-raho

పోలీసులను బెదిరించి.. ఇసుక ట్రాక్టర్ల తరలింపు - bhupalapally district crime news

ఇసుక అక్రమార్కుల ఆగడాలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. పోలీస్ అధికారులపై దాడులు చేయడానికి సైతం వెనకాడటం లేదు. తాజాగా ఇలాంటి ఘటనే జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.

Sand smugglers threated police in bhupalpally district
పోలీసులను బెదిరించి.. ఇసుక ట్రాక్టర్ల తరలింపు
author img

By

Published : Oct 5, 2020, 2:25 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నవాబుపేటలో ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. చిట్యాల పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. నవాబుపేట్ వాగు వద్ద ఇసుక లోడుతో ఉన్న రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఒకటి నవాబుపేట్ గ్రామానికి చెందిన వార్డు మెంబర్ శివరాత్రి అనిల్, మరోటి పప్పు శ్రీనివాస్​కు చెందిందిగా గుర్తించారు.

ట్రాక్టర్లను పోలీస్​ స్టేషన్​కు తరలిస్తుండగా.. శివరాత్రి అనిల్, పప్పు శ్రీనివాస్​లు పోలీస్ సిబ్బందిని అడ్డగించి, వారిని బెదిరించి ఇసుక ట్రాక్టర్లలను తీసుకెళ్లిపోయారు. ఈ మేరకు పోలీస్​ సిబ్బంది విధులకు భంగం కలిగించిన ఇద్దరిపై క్రిమినల్​ కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నవాబుపేటలో ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. చిట్యాల పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. నవాబుపేట్ వాగు వద్ద ఇసుక లోడుతో ఉన్న రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఒకటి నవాబుపేట్ గ్రామానికి చెందిన వార్డు మెంబర్ శివరాత్రి అనిల్, మరోటి పప్పు శ్రీనివాస్​కు చెందిందిగా గుర్తించారు.

ట్రాక్టర్లను పోలీస్​ స్టేషన్​కు తరలిస్తుండగా.. శివరాత్రి అనిల్, పప్పు శ్రీనివాస్​లు పోలీస్ సిబ్బందిని అడ్డగించి, వారిని బెదిరించి ఇసుక ట్రాక్టర్లలను తీసుకెళ్లిపోయారు. ఈ మేరకు పోలీస్​ సిబ్బంది విధులకు భంగం కలిగించిన ఇద్దరిపై క్రిమినల్​ కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

ఇదీ చూడండి: కాంక్రీట్‌ వేస్తుండగా కూలిన స్లాబ్.. పది మందికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.