ETV Bharat / jagte-raho

లారీని ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి

author img

By

Published : Oct 10, 2020, 8:57 AM IST

కారు లారీని ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన వనపర్తి జిల్లా కొత్తకోట బైపాస్ రోడ్డు​లో జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరు గాయపడ్డారు.

road accident at kothakota in wanaparthy district
లారీని ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి

వనపర్తి జిల్లా కొత్తకోట బైపాస్​ రోడ్డులో ప్రమాదం జరిగింది. కర్నూలు నుంచి సాఫ్ట్​వేర్ ఉద్యోగులు ఆనంద్​, మల్లికార్జున్ కారులో హైదరాబాద్​కు బయల్దేరారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో వనపర్తి జిల్లా కొత్తకోట బైపాస్ రోడ్డులో ముందు వెళ్తున్న కంటైనర్ లారీని వీరి కారు వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న ఆనంద్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మల్లికార్జున్​కు తీవ్ర గాయాలు కావటంతో చికిత్స కోసం వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారులో ఉన్న ఎయిర్​ బెలూన్స్​ తెరుచుకున్నా ఫలితం లేకపోయింది. అతి వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

వనపర్తి జిల్లా కొత్తకోట బైపాస్​ రోడ్డులో ప్రమాదం జరిగింది. కర్నూలు నుంచి సాఫ్ట్​వేర్ ఉద్యోగులు ఆనంద్​, మల్లికార్జున్ కారులో హైదరాబాద్​కు బయల్దేరారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో వనపర్తి జిల్లా కొత్తకోట బైపాస్ రోడ్డులో ముందు వెళ్తున్న కంటైనర్ లారీని వీరి కారు వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న ఆనంద్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మల్లికార్జున్​కు తీవ్ర గాయాలు కావటంతో చికిత్స కోసం వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారులో ఉన్న ఎయిర్​ బెలూన్స్​ తెరుచుకున్నా ఫలితం లేకపోయింది. అతి వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

ఇదీ చదవండి: ఒకే​ జిల్లాలో ఒకే రోజు 5 మిస్సింగ్​ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.