ETV Bharat / jagte-raho

ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ.. ఇద్దరు యువకుల దుర్మరణం

author img

By

Published : Jul 2, 2020, 10:16 AM IST

ద్విచక్ర వాహనాన్ని లారీ వెనక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన నిజామాబాద్​ జిల్లాలో చోటుచేసుకుంది.

road accident at govuru two died in nizamabad district
లారీ చక్రాల కింద పడి ఇద్దరు యువకుల దుర్మరణం

నిజామాబాద్ జిల్లా మోస్రా మండలం గోవూరు వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని లారీ వెనక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

గోవూరు గ్రామానికి చెందిన దండు సాయిలు, సుండు ప్రవీణ్​లు ద్విచక్ర వాహనంపై చందూరు నుంచి గోవూరు వస్తున్నారు. ఈ క్రమంలో గ్రామ సమీపంలోకి రాగానే నిజామాబాద్ వైపు వెళ్తున్న లారీ వెనక నుంచి వీరి బైకును ఢీకొట్టింది. ఫలితంగా ఇద్దరు లారీ చక్రాల కింద పడి మృతి చెందారు.

పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఒకే ఊరికి చెందిన ఇద్దరు చనిపోవడం వల్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

లారీ చక్రాల కింద పడి ఇద్దరు యువకుల దుర్మరణం

ఇదీచూడండి: మద్యం మత్తులో గర్భవతి అయిన భార్యను కొట్టి చంపిన భర్త

నిజామాబాద్ జిల్లా మోస్రా మండలం గోవూరు వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని లారీ వెనక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

గోవూరు గ్రామానికి చెందిన దండు సాయిలు, సుండు ప్రవీణ్​లు ద్విచక్ర వాహనంపై చందూరు నుంచి గోవూరు వస్తున్నారు. ఈ క్రమంలో గ్రామ సమీపంలోకి రాగానే నిజామాబాద్ వైపు వెళ్తున్న లారీ వెనక నుంచి వీరి బైకును ఢీకొట్టింది. ఫలితంగా ఇద్దరు లారీ చక్రాల కింద పడి మృతి చెందారు.

పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఒకే ఊరికి చెందిన ఇద్దరు చనిపోవడం వల్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

లారీ చక్రాల కింద పడి ఇద్దరు యువకుల దుర్మరణం

ఇదీచూడండి: మద్యం మత్తులో గర్భవతి అయిన భార్యను కొట్టి చంపిన భర్త

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.