మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని బొడ్డితండా, బక్కతండా, ఫకీరాతండా, వెంక్యాతండా, దాసుతండాల్లోని గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్, సివిల్ పోలీసుల దాడులు నిర్వహించారు. ఈదాడుల్లో 35 లీటర్ల గుడుంబా, 275 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు.
97 కిలోల నల్లబెల్లం, ఐదు కిలోల పటికను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా గుడుంబా తయారీకి పాల్పడుతున్న 9 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఆబ్కారీ సీఐ లావణ్యసంధ్య తెలిపారు.
ఇదీ చూడండి: అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఆసుపత్రి సీజ్