ETV Bharat / jagte-raho

ప్రమాదం: రోడ్డు దాటుతుండగా... డీసీఎం ఢీకొని వ్యక్తి మృతి

author img

By

Published : Aug 20, 2020, 12:04 PM IST

డీసీఎం వాహనం ఢీకొనడంతో రోడ్డు దాటుతున్న ఓ యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

One died in a road accident at sangareddy district
ప్రమాదం: రోడ్డు దాటుతుండగా... డీసీఎం ఢీకొని వ్యక్తి మృతి

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​ మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మోరే కాలనీకి చెందిన ప్రశాంత్​ (25) ఇంటి ముందున్న రోడ్డు దాటుతుండగా... బీదర్​ వైపు వెళ్తున్న డీసీఎం వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ప్రశాంత్​ గాల్లోకి ఎగిరి పడి అక్కడికక్కడే మృతి చెందాడు. వేగ నియంత్రణ కోల్పోయిన వాహనం అదుపుతప్పి.. ఇళ్లవైపు దూసుకొచ్చింది.

ఘటనా స్థలాన్ని జహీరాబాద్​ ఎస్సై వినయ్​కుమార్​ పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​ మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మోరే కాలనీకి చెందిన ప్రశాంత్​ (25) ఇంటి ముందున్న రోడ్డు దాటుతుండగా... బీదర్​ వైపు వెళ్తున్న డీసీఎం వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ప్రశాంత్​ గాల్లోకి ఎగిరి పడి అక్కడికక్కడే మృతి చెందాడు. వేగ నియంత్రణ కోల్పోయిన వాహనం అదుపుతప్పి.. ఇళ్లవైపు దూసుకొచ్చింది.

ఘటనా స్థలాన్ని జహీరాబాద్​ ఎస్సై వినయ్​కుమార్​ పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి:- రాజధానిలో రోజువారీ కేసుల కన్నా రికవరీలే ఎక్కువ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.