ETV Bharat / jagte-raho

ఆటోను ఢీకొట్టిన లారీ.. తండ్రి మృతి, బిడ్డకు తీవ్రగాయాలు - సంగారెడ్డి జిల్లా తాజా వార్తలు

సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం చోటకూర్ గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వస్తున్న లారీ ఆటోను బలంగా ఢీకొట్టిన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరోకరు తీవ్రంగా గాయపడ్డారు.

లారీ ఆటో ఢీ.. తండ్రి మృతి, బిడ్డకు తీవ్రగాయాలు
లారీ ఆటో ఢీ.. తండ్రి మృతి, బిడ్డకు తీవ్రగాయాలు
author img

By

Published : Jun 16, 2020, 7:45 PM IST

సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం చోటకూర్ గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం మర్వెల్లి గ్రామానికి చెందిన బేగరి అశోక్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగించేవాడు. అతని కొడుకు శశాంక్​తో కలిసి మర్వెల్లి నుంచి ఆటోలో హైదరాబాదులోని కేపీహెచ్​బీకి బయలుదేరాడు.

చోటకూర్ గ్రామ శివారులోకి రాగానే ఎదురుగా అతివేగంతో వస్తున్న లారీ వీరు వెళ్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో శశాంక్​కు తీవ్రగాయాలు కాగా.. అశోక్​ను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుని భార్య జయమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగలక్ష్మి తెలిపారు.

సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం చోటకూర్ గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం మర్వెల్లి గ్రామానికి చెందిన బేగరి అశోక్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగించేవాడు. అతని కొడుకు శశాంక్​తో కలిసి మర్వెల్లి నుంచి ఆటోలో హైదరాబాదులోని కేపీహెచ్​బీకి బయలుదేరాడు.

చోటకూర్ గ్రామ శివారులోకి రాగానే ఎదురుగా అతివేగంతో వస్తున్న లారీ వీరు వెళ్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో శశాంక్​కు తీవ్రగాయాలు కాగా.. అశోక్​ను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుని భార్య జయమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగలక్ష్మి తెలిపారు.

ఇవీ చూడండి: 'పందులే గుంపులుగా వస్తాయి... సింహం సింగిల్‌గా వస్తుంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.