శంషాబాద్ విమానాశ్రయంలో 700 గ్రాముల బంగారం పట్టుబడింది. ఆదివారం వేరు వేరు విమానాల్లో దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇద్దరు ప్రయాణికులను పక్కా సమాచారంతో అధికారులు తనిఖీ చేశారు. పిల్లలు ఆడుకునే బొమ్మలో బంగారం పెట్టి తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. వాటిని తెరచి చూడగా ఒకరి నుంచి 349 గ్రాములు, మరో వ్యక్తి వద్ద 375 గ్రాముల బంగారం దొరికినట్లు కస్టమ్స్ ఎయిర్ పోర్టు డిప్యూటీ కమిషనర్ రవి తెలిపారు.
ఇదీ చదవండి:గ్రామంలో ఉద్రిక్తత... 144 సెక్షన్ అమలు