సైబర్ నేరగాళ్లు రోజుకో రీతిలో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. వీరి ఉచ్చులో చిక్కుకుని, డబ్బులు పోగొట్టుకుంటున్నవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా హైదరాబాద్ చిక్కడపల్లికి చెందిన ఓ మహిళకు ఓటీపీ పంపంచి.. ఖాతా నుంచి రూ.5 లక్షలు స్వాహా చేశారు కేటుగాళ్లు. ఓఎల్ఎక్స్ పేరుతో మరో వ్యక్తి వద్ద రూ.3.70 లక్షలు కాజేశారు.
మోసపోయినట్లు గుర్తించిన బాధితులు సైబర్క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.