మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జగద్గిరిగుట్ట పరిధి బీరప్పనగర్లోని ఓ ద్విచక్రవాహన షో రూమ్లో అగ్ని ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున ఈ ఘటన సంభవించింది. ఈ ప్రమాదంలో 32 ద్విచక్రవాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. నాలుగు రోజుల క్రితం దుకాణ యజమాని యాదగిరి ఓ ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేశారు. 13న షోరూమ్ మూసేశారు.
గురువారం తెల్లవారుజామున దుకాణం లోపల నుంచి పొగలు వస్తున్నాయని స్థానికులు గమనించారు. యజమానికి సమాచారమిచ్చారు. అప్పటికే 32 ద్విచక్రవాహనాలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనం వల్లే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
![fire-accident-at-bike-show-room-in-medchal-malkajigiri-district-news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-hyd-39-15-32bikes-smashed-on-fire-cctv-av-ts10011_15012021192257_1501f_1610718777_891.jpg)
ఇదీ చదవండి: విషాదం: పతంగి ఎగురవేస్తూ బాలుడు మృతి!