ETV Bharat / jagte-raho

పోలీసుల స్నేహితులే టార్గెట్.. నమ్మించి టోకరా వేస్తున్న కేటుగాళ్లు

author img

By

Published : Sep 29, 2020, 5:00 PM IST

Updated : Sep 29, 2020, 5:53 PM IST

సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. పోలీసులనే లక్ష్యంగా చేసుకుని... వారిపేరుపై నకిలీ ఫేస్ బుక్ ఖాతాలు తెరుస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. నకిలీ ఐడీల ఆధారంగా పోలీసుల స్నేహితులతో చాటింగ్ చేసి.. డబ్బులు అవసరం ఉన్నాయంటూ నమ్మిస్తారు. తర్వాత ఖాతా నెంబర్లు పంపి అందినకాడికి దోచుకుంటున్నారు.

పోలీసుల పేరుతో అందినకాడికి దోచేస్తున్నారు
పోలీసుల పేరుతో అందినకాడికి దోచేస్తున్నారు

పోలీసులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సీఐడీ అదనపు ఎస్పీ నాగరాజ్ కుమార్, సీసీఎస్ ఏసీపీ రవీందర్ రెడ్డి, మహంకాళి ఇన్ స్పెక్టర్ కావేటి శ్రీనివాసులపై సైబర్ నేరగాళ్లు నకిలీ ఎఫ్​బీ ఐడీలు తయారు చేశారు.

వాటి ఆధారంగా.. వారి స్నేహితులకు ఫ్రెండ్​ రిక్వెస్ట్​లు పంపిస్తున్నారు. ఆ తర్వాత వారితో చాటింగ్ చేసి.. తమ వారికి అత్యవసరంగా డబ్బులు కావాలంటూ రూ. 5 నుంచి 10 వేలు అడుగుతున్నారు. అయితే తక్కువ మొత్తం కావడం వల్ల పలువురు.. సైబర్ నేరగాళ్లు ఇచ్చే బ్యాంకు ఖాతాలకు పంపిస్తున్నారు. మరికొందరు వారిని అడిగి తెలుసుకుంటున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నేరగాళ్లు పంపిన ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతాలు.. రాజస్థాన్, కోల్ కతా, ఒడిశా ప్రాంతాలకు చెందినవిగా తేలింది.

ఓఎల్ఎక్స్​లో ఆర్మీ పేరును వాడుతున్న ఈ సైబర్ నేరగాళ్లు.. ఇటీవల ఫేస్ బుక్ వేదికగా పోలీసులను వాడుకుంటున్నారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. ఎవరైనా డబ్బులు పంపాలంటూ మెస్సేజ్​లు పంపిస్తే.. వారికి ఫోన్ చేసి అడిగిన తర్వాతే పంపించాలని సూచించారు.

ఇదీ చదవండి: ఆ ఛాలెంజ్​లకు దూరంగా ఉండండి : సైబరాబాద్​ పోలీసులు

పోలీసులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సీఐడీ అదనపు ఎస్పీ నాగరాజ్ కుమార్, సీసీఎస్ ఏసీపీ రవీందర్ రెడ్డి, మహంకాళి ఇన్ స్పెక్టర్ కావేటి శ్రీనివాసులపై సైబర్ నేరగాళ్లు నకిలీ ఎఫ్​బీ ఐడీలు తయారు చేశారు.

వాటి ఆధారంగా.. వారి స్నేహితులకు ఫ్రెండ్​ రిక్వెస్ట్​లు పంపిస్తున్నారు. ఆ తర్వాత వారితో చాటింగ్ చేసి.. తమ వారికి అత్యవసరంగా డబ్బులు కావాలంటూ రూ. 5 నుంచి 10 వేలు అడుగుతున్నారు. అయితే తక్కువ మొత్తం కావడం వల్ల పలువురు.. సైబర్ నేరగాళ్లు ఇచ్చే బ్యాంకు ఖాతాలకు పంపిస్తున్నారు. మరికొందరు వారిని అడిగి తెలుసుకుంటున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నేరగాళ్లు పంపిన ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతాలు.. రాజస్థాన్, కోల్ కతా, ఒడిశా ప్రాంతాలకు చెందినవిగా తేలింది.

ఓఎల్ఎక్స్​లో ఆర్మీ పేరును వాడుతున్న ఈ సైబర్ నేరగాళ్లు.. ఇటీవల ఫేస్ బుక్ వేదికగా పోలీసులను వాడుకుంటున్నారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. ఎవరైనా డబ్బులు పంపాలంటూ మెస్సేజ్​లు పంపిస్తే.. వారికి ఫోన్ చేసి అడిగిన తర్వాతే పంపించాలని సూచించారు.

ఇదీ చదవండి: ఆ ఛాలెంజ్​లకు దూరంగా ఉండండి : సైబరాబాద్​ పోలీసులు

Last Updated : Sep 29, 2020, 5:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.