ETV Bharat / jagte-raho

తీసుకున్న డబ్బు ఇవ్వట్లేదని తోటి స్నేహితున్ని హతమార్చారు

అవసరం కోసం తీసుకున్న డబ్బు ఇవ్వకపోవడంతో పాటు బెదిరిస్తున్నాడన్న కోపంతో ఆ స్నేహితులు కక్ష కట్టారు. పార్టీ చేసుకుందామని పిలిచి.. అడవిలోకి తీసుకెళ్లి హతమార్చారు. మొదట అదృశ్యం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా హత్య విషయం తెలిసింది. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి.. మరికొందరి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు పోలీసులు.

author img

By

Published : Oct 2, 2020, 9:36 PM IST

తీసుకున్న డబ్బు ఇవ్వట్లేదని తోటి స్నేహితున్ని హతమార్చారు
తీసుకున్న డబ్బు ఇవ్వట్లేదని తోటి స్నేహితున్ని హతమార్చారు

తీసుకున్న డబ్బు ఇవ్వకుండా దౌర్జన్యం చేస్తున్నాడనే కోపంతో స్నేహితున్నే హతమార్చారు తోటి స్నేహితులు. హైదరాబాద్ పాతబస్తీ ఛత్రినాక శివాజీ నగర్​కు చెందిన విశాల్, బాబా నగర్​కు చెందిన నసీర్​, జయిద్ స్నేహితులు. విశాల్ తన స్నేహితుల వద్ద డబ్బు తీసుకొని ఇవ్వకుండా బెదిరిస్తున్నాడని కక్ష కట్టిన నసీర్, జయిద్​లు.. మరి కొందరితో కలిసి పార్టీ చేసుకుందామని పిలిచారు. గత నెల 28, 29 మధ్య రాత్రి విశాల్​ను ఓ కార్లో జహీరాబాద్ సమీపంలోని అడవి ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేశారు.

తన కుమారుడు కనిపించడం లేదని విశాల్ తల్లి ఛత్రినాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదృశ్యం కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తులో విశాల్ అడవిలో హత్యకు గురయినట్లు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విశాల్ మృతదేహాన్ని జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి శవ పరీక్ష నిర్వహించారు.

విశాల్ అదృశ్యం కేసుని హత్య కేసుగా మార్చి దర్యాప్తు చేయగా నసీర్ (20), జయిద్ (19) మరి కొందరు కలసి చంపినట్లు తేలింది. శుక్రవారం నసీర్, జయిద్​ను పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరి కొంతమంది నిందితుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: ఆస్తికి అడ్డువస్తాడని: ఏడాది వయసున్న తమ్ముడిని చంపిన అన్న

తీసుకున్న డబ్బు ఇవ్వకుండా దౌర్జన్యం చేస్తున్నాడనే కోపంతో స్నేహితున్నే హతమార్చారు తోటి స్నేహితులు. హైదరాబాద్ పాతబస్తీ ఛత్రినాక శివాజీ నగర్​కు చెందిన విశాల్, బాబా నగర్​కు చెందిన నసీర్​, జయిద్ స్నేహితులు. విశాల్ తన స్నేహితుల వద్ద డబ్బు తీసుకొని ఇవ్వకుండా బెదిరిస్తున్నాడని కక్ష కట్టిన నసీర్, జయిద్​లు.. మరి కొందరితో కలిసి పార్టీ చేసుకుందామని పిలిచారు. గత నెల 28, 29 మధ్య రాత్రి విశాల్​ను ఓ కార్లో జహీరాబాద్ సమీపంలోని అడవి ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేశారు.

తన కుమారుడు కనిపించడం లేదని విశాల్ తల్లి ఛత్రినాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదృశ్యం కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తులో విశాల్ అడవిలో హత్యకు గురయినట్లు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విశాల్ మృతదేహాన్ని జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి శవ పరీక్ష నిర్వహించారు.

విశాల్ అదృశ్యం కేసుని హత్య కేసుగా మార్చి దర్యాప్తు చేయగా నసీర్ (20), జయిద్ (19) మరి కొందరు కలసి చంపినట్లు తేలింది. శుక్రవారం నసీర్, జయిద్​ను పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరి కొంతమంది నిందితుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: ఆస్తికి అడ్డువస్తాడని: ఏడాది వయసున్న తమ్ముడిని చంపిన అన్న

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.