ETV Bharat / jagte-raho

రోడ్డు దాటుతుండగా ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి - two dead in a car accident near lb nagar

ఎల్బీనగర్- దిల్​సుఖ్​నగర్​ ప్రధాన రహదారిపై అర్ధరాత్రి రోడ్డు దాటుతున్న ఇద్దరిని అతివేగంగా వచ్చిన ఓ కారు ఢీకొనగా వారిద్దరూ అక్కడికక్కడే మరణించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

car hit two persons at lb nagar in hyderabad
రోడ్డు దాటుతుండగా ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి
author img

By

Published : Sep 7, 2020, 9:52 AM IST

హైదరాబాద్​లో ఎల్బీనగర్​-దిల్​సుఖ్​నగర్​ ప్రధాన రహదారిపై అర్ధరాత్రి అతివేగంగా.. దూసుకొచ్చిన TS 13 UA 7633 కారు.. చైతన్యపురి యూటర్న్​ వద్ద రోడ్డు దాటుతున్న రవి, ధన్​రాజ్​ అనే ఇద్దరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.

ఘటన తర్వాత మృతులను ఢీకొట్టిన కారు డ్రైవర్ పరారయ్యాడు. ఘటనాస్థలానికి చేరుకున్న సరూర్​నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

హైదరాబాద్​లో ఎల్బీనగర్​-దిల్​సుఖ్​నగర్​ ప్రధాన రహదారిపై అర్ధరాత్రి అతివేగంగా.. దూసుకొచ్చిన TS 13 UA 7633 కారు.. చైతన్యపురి యూటర్న్​ వద్ద రోడ్డు దాటుతున్న రవి, ధన్​రాజ్​ అనే ఇద్దరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.

ఘటన తర్వాత మృతులను ఢీకొట్టిన కారు డ్రైవర్ పరారయ్యాడు. ఘటనాస్థలానికి చేరుకున్న సరూర్​నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి: అంతా సిద్ధం: నేటి నుంచి శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.