ETV Bharat / jagte-raho

లంగర్​హౌస్​లో విషాదం... ఉరివేసుకుని బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

author img

By

Published : Sep 13, 2020, 3:46 PM IST

గదిలో ఉరి వేసుకుని బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన లంగర్​హౌస్​లోని ప్రశాంత్​ నగర్​ కాలనీలో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని... మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

btech-student-hang-himself-at-prashanth-nagar-in-langur-house
లంగర్​హౌస్​లో విషాదం... ఉరివేసుకుని బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

లంగర్ హౌస్ పోలీస్​స్టేషన్ పరిధిలోని ప్రశాంత్ నగర్​లో విషాదం చోటు చేసుకుంది. సూర్యాపేటకు చెందిన బీటెక్ విద్యార్థి విజయ్.. రెండు రోజుల క్రితం ప్రశాంత్ నగర్​లో ఉంటున్న తన స్నేహితుడి అద్దె ఇంటికి వచ్చాడు. కానీ అతను లేకపోవడంతో... ఫోన్ చేశాడు. 4 నెలల నుంచి రూమ్​లో ఉండట్లేదని... ఊరు వెళ్లానని.. గది లాకర్ కూడ తన వద్దే ఉందని అతను తెలిపాడు.

తాళం బద్దలు కొట్టిన విజయ్... రెండు రోజులుగా రూమ్​లోనే ఉంటున్నాడు. యజమాని ఇంటి అద్దె అడిగేందుకు ఉదయం వెళ్లగా... విజయ్ ఉరి వేసుకుని ఉన్నట్లు గమనించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్​మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

లంగర్ హౌస్ పోలీస్​స్టేషన్ పరిధిలోని ప్రశాంత్ నగర్​లో విషాదం చోటు చేసుకుంది. సూర్యాపేటకు చెందిన బీటెక్ విద్యార్థి విజయ్.. రెండు రోజుల క్రితం ప్రశాంత్ నగర్​లో ఉంటున్న తన స్నేహితుడి అద్దె ఇంటికి వచ్చాడు. కానీ అతను లేకపోవడంతో... ఫోన్ చేశాడు. 4 నెలల నుంచి రూమ్​లో ఉండట్లేదని... ఊరు వెళ్లానని.. గది లాకర్ కూడ తన వద్దే ఉందని అతను తెలిపాడు.

తాళం బద్దలు కొట్టిన విజయ్... రెండు రోజులుగా రూమ్​లోనే ఉంటున్నాడు. యజమాని ఇంటి అద్దె అడిగేందుకు ఉదయం వెళ్లగా... విజయ్ ఉరి వేసుకుని ఉన్నట్లు గమనించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్​మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి: శ్రావణి ఆత్మహత్య కేసులో విచారణకు హాజరైన సాయిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.