పూర్తిగా నెలలు నిండని పసికందును నీటి కాల్వలో విసిరేసిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో చోటుచేసుకుంది. మీనుగోని పల్లి రహదారిలో ఉన్న కోయిల్ సాగర్ ఎడమ కాల్వలో నెలలు నిండని పసికందును గుర్తుతెలియని వ్యక్తులు నిర్లక్ష్యంగా కాల్వలో విసిరి వెళ్లారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని విచారణ చేపట్టారు.