ETV Bharat / jagte-raho

దుర్గామాత ఊరేగింపులో అపశ్రుతి.. ఇద్దరి గాయాలు

author img

By

Published : Oct 26, 2020, 3:33 PM IST

నవరాత్రులు భక్తుల పూజలందుకున్న దుర్గామాత నిమజ్జన ఊరేగింపులో అపశ్రుతి చోటుచేసుకుంది. విద్యుత్​ వైర్లు తెగిపడి ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. ఈ ఘటన నిజామాబాద్​ జిల్లా మోస్రలో చోటుచేసుకుంది.

a small accident in durga devi Procession at mosra in nizamabad district
దుర్గామాత ఊరేగింపులో అపశ్రుతి.. ఇద్దరి గాయాలు

నిజామాబాద్ జిల్లా మోస్ర మండల కేంద్రంలో తొమ్మిదిరోజుల పాటు ప్రత్యేక పూజలందుకున్న దుర్గామాత విగ్రహాన్ని ఉత్సవ కమిటి సభ్యులు ఊరేగింపుగా నిమజ్జనానికి తీసుకెళ్లారు. కాగా ఈ ఊరేగింపులో అపశ్రుతి చోటుచేసుకుంది. విద్యుత్ తీగలు తెగిపడడం వల్ల విద్యుదాఘాతంతో నవీన్, రవీందర్ గౌడ్​కు గాయాలయ్యాయి.

హుటాహుటిన స్పందించిన పోలీసు సిబ్బంది వారి వాహనంలో బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల ప్రాణాలకేమీ ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. వెంటనే స్పందించి సాయం అందించిన వర్ని మండల ఎస్సై అనిల్ రెడ్డి, సిబ్బందికి ఉత్సవ కమిటి సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చూడండి: షేర్​చాట్​లో వీడియో తీస్తుండగా ప్రమాదం... బాలుడి మృతి

నిజామాబాద్ జిల్లా మోస్ర మండల కేంద్రంలో తొమ్మిదిరోజుల పాటు ప్రత్యేక పూజలందుకున్న దుర్గామాత విగ్రహాన్ని ఉత్సవ కమిటి సభ్యులు ఊరేగింపుగా నిమజ్జనానికి తీసుకెళ్లారు. కాగా ఈ ఊరేగింపులో అపశ్రుతి చోటుచేసుకుంది. విద్యుత్ తీగలు తెగిపడడం వల్ల విద్యుదాఘాతంతో నవీన్, రవీందర్ గౌడ్​కు గాయాలయ్యాయి.

హుటాహుటిన స్పందించిన పోలీసు సిబ్బంది వారి వాహనంలో బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల ప్రాణాలకేమీ ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. వెంటనే స్పందించి సాయం అందించిన వర్ని మండల ఎస్సై అనిల్ రెడ్డి, సిబ్బందికి ఉత్సవ కమిటి సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చూడండి: షేర్​చాట్​లో వీడియో తీస్తుండగా ప్రమాదం... బాలుడి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.